Skip to main content

Audimulapu Suresh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించ‌డం లేదు..కార‌ణం ఇదే..

క్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచ‌న లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు.
Adimulapu Suresh
Adimulapu Suresh

తెలంగాణ‌లో మాదిరిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తార‌ని త‌ల్లిదండ్రులు బావించారు. అయితే ఏపీలో ఇంట‌ర్ కాలేజీల‌కు జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. జ‌న‌వ‌రి 17వ తేదీన కాలేజీల‌ను తిరిగి య‌థావిధిగా ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అలాగే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు కూడా సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకంటించిన విష‌యం తెల్సిందే. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభించ‌నున్నారు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. అయితే ఏపీలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది క‌నుక ప్ర‌భుత్వం కూడా ఇలాంటే నిర్ణ‌యమే తీసుకుంటుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ప్ర‌భుత్వం మాత్రం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లో మాత్రం...
తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు.కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని 16వ తేదీ వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించినట్లు సమాచారం.

సెలవులు కూడా..
ఇక తెలంగాణ‌లో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. 

ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం..

holidays


రాష్ట్రంలో కరోనా ఆంక్షలను జ‌న‌వ‌రి 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 30వ తేదీ వరకు పొడిగించారు. ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అటు ప్రత్యక్ష తరగతులు, ఇటు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించలేదన్న విమర్శలు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది.

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Published date : 16 Jan 2022 05:19PM

Photo Stories