Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
CM KCR
జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ జనవరి 3వ తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. 16 తర్వాత వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు.