భువనగిరి, మోత్కూరు : భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, మోత్కూరు మండలాల పరిధిలో 108 అంబులెన్స్లపై పని చేయడానికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆగస్టు 20న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈఎంటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సైన్స్ గ్రూప్లో డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఈఎంటీ, టెన్త్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ పూర్తిచేసి 30 ఏళ్ల వయస్సులోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు. ఎంపికై న వారికి 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు 99852 26582, 80089 35522 నంబర్లలో సంప్రదించాలని కోరారు.