Skip to main content

School Education: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌... నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా జేఎన్‌వీలు

జవహర్‌ నవోదయ విద్యాలయాలు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌! ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ.. చదువు, వసతి, భోజనం అంతా ఉచితం. ఒత్తిడిలేని విద్య, ఆటపాటలతో వికాసానికి పెద్దపీట వేసే విద్యాలయాలు ఇవి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా వీటిల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో..నవోదయ విద్యాలయాల ప్రత్యేకతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... పాఠశాల చదువు విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనది. ఈ దశలో వినూత్న విద్య, బోధన విధానాన్ని అమలు చేసి.. బాలల సంపూర్ణ వికాసానికి పునాదులు వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైనవే జవహర్‌ నవోదయ విద్యాలయాలు. ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను సైతం నెలకొల్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా జేఎన్‌వీలు అడుగులు వేస్తున్నాయి.
Jawahar Navodaya admissions 2023

లెర్నింగ్‌ బై డూయింగ్‌
నవోదయ విద్యాలయాల బోధనలో లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానం అమలవుతోంది. అంటే.. ఏదైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు దానికి సంబంధించి ప్రాక్టికల్స్, పజిల్స్, క్విజ్‌లు వంటి వాటి ద్వారా సదరు అంశంపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా నవోదయ పాఠశాలల్లో మరో ప్రత్యేక విధానం..యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్ట్‌లకు సంబం«ధించి విద్యార్థులకు వాస్తవ దృక్పథం, ఆలోచన పరిధి పెరిగేలా యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ను అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ వర్క్స్, స్కూల్‌ స్థాయిలో ఎగ్జిబిషన్స్‌ వంటివి నిర్వహిస్తూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు వాస్తవ రూపం ఇచ్చేలా బోధన ఉంటోంది.

చ‌ద‌వండి: న‌వోద‌య ఎగ్జామ్ వివ‌రాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ కోసం క్లిక్ చేయండి

పూర్తిగా రెసిడెన్షియల్‌
నవోదయ విద్యాలయాల్లో పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానం అమలవుతోంది. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు సదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. క్లాస్‌ రూమ్‌ తరగతులతోపాటు.. అవి ముగిశాక∙హాస్టల్స్‌లో మెంటార్స్‌ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది. తద్వారా విద్యార్థులు క్లాస్‌ రూమ్‌ వెలుపల అభ్యసనం సాగించే సమయంలో ఉపాధ్యాయుల సహకారం అందేలా చూస్తున్నారు.

ఎనిమిది నుంచి ఇంగ్లిష్‌ మీడియం
నవోదయ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం బోధన మొదలవుతుంది. ఎనిమిదో తరగతి నుంచి మ్యాథమెటిక్స్,సైన్స్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌ మీడియంలో, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ను హిందీ మీడియంలో చదవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ఆరో తరగతి వరకు మాత్రం విద్యార్థులు తమ మాతృ భాష లేదా తమ ప్రాంతీయ భాషలో చదివే అవకాశం కల్పిస్తున్నారు.
 

చ‌ద‌వండి: ఈ టిప్స్ పాటిస్తే... నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో విజయం మీదే

ఫీజులు లేవు
జేఎన్‌వీల మరో ప్రత్యేకత..ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందించడం. రెసిడెన్షియల్‌ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలో 15, తెలంగాణలో 9

  • ప్రస్తుతం జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా 649 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని 15 పాఠశాలల్లో 2 పాఠశాలలను ఎస్‌సీ/ఎస్‌టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 
  • ప్రతి నవోదయలో ఆరో తరగతిలో గరిష్టంగా 80 సీట్లు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా 40 సీట్లు ఉంటాయి. గతేడాది వరకు గరిష్ట సీట్ల సంఖ్య ప్రతి పాఠశాలలో 60గా మాత్రమే ఉండేది. ఈ ఏడాది 80కి పెరగడంతో మరింతమంది విద్యార్థులకు నవోదయలో చదివే అవకాశం లభించనుంది. 

చ‌ద‌వండి: న‌వోదయ తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు సంబంధించిన వివ‌రాల‌కు క్లిక్ చేయండి

అర్హతలు

  • 2022–23లో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. లేదా ఎన్‌ఐఓఎస్‌ నిర్వహించే ‘బి’ కాంపిటెన్సీ కోర్సు చదువుతుండాలి.
  • విద్యార్థులు తాము దరఖాస్తులో పేర్కొన్న జేఎన్‌వీ నెలకొన్న జిల్లాలకు చెందిన వారై ఉండాలి.
  • గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించిన 75 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా..గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే మూడు,నాలుగు,అయిదో తరగతి చదవాలి.
  • వయసు: మే 1, 2011–ఏప్రిల్‌ 30, 2013 మధ్యలో జన్మించి ఉండాలి.
  • 100 మార్కులకు పరీక్ష
  • నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎస్‌టీ)ను నిర్వహిస్తారు. 2023–24కు సంబంధించి ఈ పరీక్ష ఏప్రిల్‌ 29న జరుగనుంది. 
  • జేఎన్‌వీఎస్‌టీ మూడు విభాగాల్లో మొత్తం 80 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, అర్థమెటిక్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులు, లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది.
  • ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు.
  • విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే తాము పరీక్ష రాయదలచుకున్న మాధ్యమాన్ని పేర్కొనాలి.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమంలోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది.

చ‌ద‌వండి: రెండు, మూడు రోజుల్లో గ్రూప్‌1 ప్రిలిమినరీ ఫలితాలు..?

జిల్లా స్థాయిలో ఎంపిక

  • ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో నెలకొల్పిన జేఎన్‌వీల్లో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థులు సదరు జేఎన్‌వీ నెలకొన్న జిల్లాకు చెందిన వారై ఉండాలి. 
  • జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో సాధించిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న జిల్లా.. సదరు జిల్లాలో ఉన్న జేఎన్‌వీలో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. రిజర్వేషన్లకు అనుగుణంగా జిల్లా స్థాయిలో తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది.

పల్లే విద్యార్థులకు ప్రాధాన్యం
జేఎన్‌వీలలోని సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను పల్లే ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా మహిళా విద్యార్థులను ప్రోత్సహించేందుకు మొత్తం సీట్లలో 33 శాతం(1/3వంతు) సీట్లను బాలికలకు కేటాయిస్తారు. 

Also read: TS SET-2023: టీఎస్‌ సెట్‌కు సిద్ధమా..!


పాఠ్య పుస్తకాలే ఆదరవుగా
జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాఠ్య పుస్తకాలనే ఆదరవుగా చేసుకోవాలి. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు అకాడమీ పుస్తకాలు, అలాగే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను చదవాలి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31,2023
  • జేఎన్‌వీఎస్‌టీ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 29.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in

Also read: Admissions in NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ కోర్సులో ప్రవేశాలు..

కో–కరిక్యులర్‌ యాక్టివిటీస్‌

జేఎన్‌వీల్లో కో–కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. ఎస్సే రైటింగ్, డిబేట్స్, క్విజ్‌లు వంటివి నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా.. నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. 
–కె.వి.సుబ్బారెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్, జేఎన్‌వీ–హైదరాబాద్‌ రీజియన్‌ 

Last Date

Photo Stories