Skip to main content

Admissions in Ekalavya Adarsha Gurukula Vidyalaya: ఆరో తరగతిలో ప్రవేశాలకు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్‌ సీట్ల భర్తీకి ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా‌..

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.
Admissions in Ekalavya Adarsha Gurukula Vidyalaya

పరీక్ష పేరు: ఈఎంఆర్‌ఎస్‌ సెలక్షన్‌ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ), ఈఎంఆర్‌ఎస్‌ లేటర్‌ ఎంట్రీ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎల్‌టీ).

మొత్తం సీట్ల సంఖ్య: 233.
సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 26(18 బాలికలు, బాలురు 8), ఎనిమిదో తరగతిలో 103(55 బాలికలు, బాలురు 48), తొమ్మిదో తరగతిలో 104(59 బాలికలు, బాలురు 45).
అర్హత: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2022–23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయసు: 31.03.2023 నాటికి ఆరో తరగతికి 10–13ఏళ్లు,ఏడో తరగతికి 12–15ఏళ్లు, ఎనిమిదో తరగతికి 13–16 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 14–17 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు..

ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ, అర్థమేటిక్, లాంగ్వేజ్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 7, 8, 9 తరగతులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, రీజనల్‌ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సైన్స్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీ„ý నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.04.2023.
ప్రవేశ పరీక్ష తేది: 07.05.2023.
పరీక్ష ఫలితాల ప్రకటన తేది: 30.05.2023.
మొదటి దశ ప్రవేశాలు: 01.06.2023 నుంచి 10.06.2023.

వెబ్‌సైట్‌: https://fastses.telangana.gov.in/

చ‌ద‌వండి: ఏపీ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories