Skip to main content

Results: తెయూ డిగ్రీ పరీక్షా ఫలితాల విడుదల

తెయూ(డిచ్‌పల్లి) : తెయూ డిగ్రీ (ఫైనలియ ర్‌) తుది సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ ఎం.అరుణ తో కలిసి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి ఆగ‌స్టు 30న‌ సాయంత్రం విడుదల చేశారు.
Results
తెయూ డిగ్రీ పరీక్షా ఫలితాల విడుదల

 డిగ్రీ పరీక్షల కు మొత్తం 9,026 మంది హాజరయ్యారని, 3,658 మంది విద్యార్థులు (40.53 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇందులో బాలికలు 51.80 శాతం, బాలురు 24.16 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ దృష్ట్యా డిగ్రీ పరీక్ష ఫలితాలను త్వరగా విడుదల చేశామన్నారు. అడిషనల్‌ కంట్రోలర్లు శాంతాబాయి, నందిని, ఆడిట్‌ సెల్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌, పీఆర్‌వో పున్నయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నా రు.www. telanganauniversity.ac.in లో ఫలితాలున్నాయని తెలిపారు.

చదవండి:

Professor Yadagiri: పోటీ పరీక్షల పుస్తకాల వివరాలివ్వండి

TU: పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే!

Published date : 31 Aug 2023 03:32PM

Photo Stories