భువనగిరి : చదువు మధ్యలో మానివేసిన వారు ఓపెన్ స్కూళ్లను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూళ్ల కన్వీనర్ జగదీష్ తెలిపారు.
ఓపెన్ స్కూళ్లను సద్వినియోగం చేసుకోవాలి
ఆగస్టు 11న భువనగిరిలోని ఓపెన్ స్కూల్ను ఆయన సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కూడా పదోన్నతి కోసం ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ చదివే అవకాశం ఉందన్నారు. అనంతరం అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాస్, శ్రవణ్కుమార్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, బాలకృష్ణ, సోమిరెడ్డి, విజయలక్ష్మి, శేషాచారి, అశోక్, సరోజా తదితరులు పాల్గొన్నారు.