Prof. G. Ram Reddy Centre for Distance Educationలో 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత ప్రవేశాలకు ఆగస్టు 1న అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలు
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 16 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 2022 సంవత్సరం నుంచి రెండు పీజీ డిప్లొమా కోర్సులతో పాటు 10వ తరగతి అర్హతతో కొత్తగా 6 నెలల యోగా సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.oucde.net వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.