Skip to main content

Online Classes: నేటి నుంచే స్కూల్స్‌కు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం.. జ‌న‌వ‌రి 30 త‌ర్వాత‌..?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లోని విద్యాసంస్థలు మళ్లీ ఆన్‌లైన్‌ బాటపట్టాయి. కరోనా ఉధృతి దృష్ట్యా సెలవుల పొడిగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Online Classes in telangana
Online Classes

8, 9, 10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశించింది. క‌రోనాతో విద్యాసంస్థ‌ల‌కు జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే సోమ‌వారం (జ‌న‌వ‌రి 24వ తేదీ) నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హింస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే 50 శాతం టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది స్కూల్‌కు హాజ‌ర‌వ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్‌ వైపు అడుగు లేయక తప్పదని పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇంజనీరింగ్ విద్యార్థుల‌కు..
ఇంజనీరింగ్‌ సహా ఉన్నత విద్య విభాగాలు ఇప్పటికే ఆన్‌లైన్‌ బోధనపై కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ టీ–శాట్‌ ద్వారా బోధనకు షెడ్యూల్‌ ఇచ్చింది. జ‌న‌వ‌రి 30వ తేదీ వరకు సెల‌వులు ప్రకటించినందున ఆ తర్వాతైనా విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనకు వెళ్తాయా? అనే సందేహాలు ఉన్నాయి. 

ప‌బ్లిక్ పరీక్షల కోసం..
కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యారంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఆన్‌లైన్‌ బోధనే అనివార్యమైంది. 2021లో ఫిబ్రవరిలో ప్రత్యక్ష బోధన మొదలైనా కోవిడ్‌ తీవ్రత పెరగడంతో మార్చి 21 నుంచి విద్యాసంస్థలు మళ్లీ మూతపడ్డాయి. దీంతో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్‌ చేశారు. ఇంజనీరింగ్‌ ఫైనల్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షల తంతు ముగించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా దెబ్బతింది. 2021 జూలై నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే బోధన చేపట్టారు. కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన అక్టోబర్‌ నుంచి మొదలైంది. ఇదే సమయంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించడం, 49 శాతం కూడా పాస్‌కాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేశారు. సరిగ్గా నాలుగు నెలలు కూడా బోధన సాగకుండానే జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు రావడం.. దాన్ని పొడిగించడం జరిగింది. 

మ‌రి సిలబస్‌ సంగతేంటి..?
►ఆన్‌లైన్‌ క్లాసుల్లో రోజుకు రెండు సబ్జెక్టులు బోధించడమే కష్టంగా ఉండేది. దీంతో జూలై–సెప్టెంబర్‌ వరకు జరిగిన ఆన్‌లైన్‌ క్లాసుల్లో పదో తరగతి సిలబస్‌ 60 శాతం పూర్తయినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మిగతాది పూర్తి చేసి, రివిజన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆన్‌లైన్‌ బోధన వల్ల సిలబస్‌ పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.
►ఇంటర్‌ విద్యలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్‌ పూర్తయింది. ఇప్పుడు ఆన్‌లైన్‌ చేపట్టినా రివిజన్‌ మాత్రమే ఉంటుందని కాలేజీ నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంకా 50 శాతం సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. టీ–శాట్‌ ద్వారా బోధన గతానికన్నా భిన్నంగా ఉంటే తప్ప, పూర్తిస్థాయిలో సిలబస్‌ పూర్తయ్యే పరిస్థితి ఉండదు.
►ఉన్నత విద్య క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ మినహా మిగతా సెమిస్టర్ల సిలబస్‌ 70 శాతం వరకూ పూర్తయింది. ఫస్టియర్‌ విద్యార్థులకు చాలాచోట్ల ఇప్పుడిప్పుడే క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఫస్టియర్‌ విద్యార్థులకు సమస్య ఉంది. డిగ్రీ కోర్సుల్లోనూ సిలబస్‌ పూర్తవ్వలేదని అధికారులు తెలిపారు.

Schools: జ‌న‌వ‌రి 24 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. ఒక‌వేళ కోవిడ్‌ కేసులు అధిక‌మైతే..

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Published date : 24 Jan 2022 12:12PM

Photo Stories