Skip to main content

NTPC: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

NTPC School of Business

మహారత్న కంపెనీ ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నడిచే ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఎన్‌ఎస్‌బీ) మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సంస్థ ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) కోర్సులను అందిస్తోంది.

కోర్సులు
పీజీడీఎం(ఎనర్జీ మేనేజ్‌మెంట్‌): ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు.
పీజీడీఎం(ఎగ్జిక్యూటివ్‌): ఈ కోర్సు కాలవ్యవధి 15 నెలలు. 

అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా∙డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ చదివే విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. క్యాట్‌/ఎక్స్‌ఏటీ లేదా జీమ్యాట్‌ వ్యాలిడ్‌æస్కోర్‌ కలిగి ఉండాలి. లేదా ఎన్‌ఎస్‌బీ
నిర్వహించే టెస్ట్‌ను రాయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారిని పర్సనల్‌ అసెస్‌మెంట్‌ చేసి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ  తర్వాత రెండో దశలో ఫైనల్‌ కాంపోజిట్‌ స్కోర్స్‌ ద్వారా తుది ఎంపిక చేపడతారు. 

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022 జనవరి 10

వెబ్‌సైట్‌: https://nsb.ac.in

చ‌ద‌వండి: JEST 2022: జాయింట్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(జెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదల..

Last Date

Photo Stories