Jobs at Private Companies: నిరుద్యోగులకు జాబ్ మేళా..
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు ఈ నెల 31వ తేదీ, మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
➤ Job fair for unemployed youth: నిరుద్యోగ యువతకు జాబ్మేళా
జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, రిలయన్స్ జియో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, బజాజ్ అలియాన్జ్, వరుణ్ మారుతీ, పద్మజ సుజుకీ, వరుణ్ బజాజ్ వంటి కంపెనీల్లో సర్వీస్ రీజినల్ హెచ్ఆర్, రిలేషన్ షిప్ ఆఫీసర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్స్, సేల్స్ లీడ్, సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వైజర్, అసిస్టెంట్ టెక్నీషియన్, డెంటర్స్, పెయింటర్స్ మొదలైన పోస్టులకు ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
➤ PGT Posts: PGT పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. బయోడేటాతో పాటుగా విద్యార్హతా పత్రాల జిరాక్స్లు, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 8142416211లో సంప్రదించాల్సిందిగా కోరారు.