Skip to main content

TSPSC Jobs Notification: డీఏఓ గ్రేడ్‌2 నోటిఫికేషన్‌ వివరాలు.. రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

tspsc dao job notification

తెలంగాణ రాష్ట్రంలో.. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణుల ముంగిట.. మరో ప్రభుత్వ కొలువు! గెజిటెడ్‌ హోదాలో.. ప్రారంభంలోనే.. రూ.45,960రూ.1,24,150 వేతన శ్రేణి అందుకునే అవకాశం! సుస్థిర భవిష్యత్తుకు మార్గం ఈ ఉద్యోగం. ఇటీవల టీఎస్‌పీఎస్సీ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ పరిధిలోని పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. విజేతలను ప్రకటించి కొలువులు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. డీఏఓ గ్రేడ్‌2 నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • డిగ్రీ ఉత్తీర్ణుల ముంగిట మరో ప్రభుత్వ కొలువు
  • డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక
  • రూ.45,960రూ.1,24,150తో ప్రారంభ వేతన శ్రేణి

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 53 డీఏఓ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. మల్టీ జోన్‌ విధానంలో పోస్ట్‌లను విభజించి.. మల్టీ జోన్‌1 పరిధిలో 28, మల్టీ జోన్‌2 పరిధిలో 25.. మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రారంభ వేతన శ్రేణిని రూ.45,960రూ.1,24,150గా పేర్కొన్నారు.

చ‌ద‌వండి: TSPSC Recruitment 2022: 53 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: 18 - 44 ఏళ్లు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు)

రాత పరీక్షలో ప్రతిభే కొలమానం

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లను రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రాత పరీక్షలో పొందాల్సిన కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం; బీసీ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

రాత పరీక్ష.. రెండు పేపర్లుగా

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు150 మార్కులకు; పేపర్‌ 2లో అర్థమెటిక్‌ అండ్‌ మెన్సురేషన్‌ 150 ప్రశ్నలు300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ విధానం లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేన్‌లో పేర్కొన్నారు. 

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

పరీక్షలో విజయానికి ఇలా

  • పేపర్‌1గా పేర్కొన్న జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌లో.. అభ్యర్థులు ప్రాంతీయం నుంచి అంతర్జాతీయ అంశాల వరకూ.. అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలను ఔపోసన పట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం,వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. 
  • తెలంగాణ విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు..నిధులు..నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పథకాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారో తెలుసుకోవాలి. పర్యావరణానికి సంబంధించి తెలంగాణకు హరితహారం అమలుచేస్తున్నారు. 

జాతీయం

మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం పలు విధానాలు అమలు చేస్తున్నారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నూతన విద్యా విధానం ముఖ్యాంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి, వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. వీటితోపాటు కోర్‌ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీకి సంబంధించిన అంశాలను కూడా ఔపోసన పట్టాలి. ఆయా సబ్జెక్ట్‌లను ప్రాంతీయ ప్రాధాన్యతల వారీగా అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది.

అంతర్జాతీయ అంశాలు

అభ్యర్థులు అంతర్జాతీయ అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. సమకాలీన పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రష్యాఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న యుద్ధం, చైనాతైవాన్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌ వంటి దేశాల అంతర్జాతీయ విధానాలు; జీ8 సదస్సు, కామన్వెల్త్‌ క్రీడలుభారత క్రీడాకారుల ప్రతిభ, బ్రిటన్‌ ప్రధాని ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై అవగాహన అవసరం.

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

పేపర్‌2..ప్రాక్టీస్‌+కాన్సెప్ట్‌లు

  • పేపర్‌2(అర్థమెటిక్‌ అండ్‌ మెన్సురేషన్‌)లో అభ్యర్థులు కాన్సెప్ట్యువల్‌ ప్రిపరేషన్‌తోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. 
  • అర్థమెటిక్‌కు సంబంధించి నంబర్‌ సిస్టమ్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. రేషనల్‌ నెంబర్స్, రియల్‌ నంబర్స్, సర్డ్స్‌ అండ్‌ లాగారిథమ్స్‌పై అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. 
  • రేషియోస్‌ అండ్‌ ప్రప్రోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. యావరేజెస్,ప్రాఫిట్‌ అండ్‌ లాస్, డిస్కౌంట్, సింపుల్‌కాంపౌండ్‌ ఇంట్రస్ట్, పార్ట్‌నర్‌షిప్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, క్లాక్, క్యాలెండర్‌ వంటి అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • అదే విధంగా బహుపదులు, శ్రేఢులు వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
  • సమితులు, లీనియర్‌ ఈక్వేషన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.
  • స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సగటు, మధ్యగతం, బాహుళకాలకు సంబంధించి అన్ని సిద్ధాంతాలను, సూత్రాలను అధ్యయనం చేసి.. వాటికి సంబంధించి సమస్యలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • మెన్సురేషన్‌కు సంబంధించి కొలతలు,స్క్వేర్స్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటర్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • రేఖా గణిత అంశాలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా.. 2డి ప్లేన్స్, స్ట్రెయిట్‌ లైన్స్, అప్లికేషన్స్, ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్‌ అప్లికేషన్స్‌ తదితర అంశాలపై సంపూర్ణ పట్టు సాధించాలి.

ప్రాక్టీస్‌తోనే సాధ్యం

డీఏఓ పరీక్షలో విజయానికి ప్రాక్టీస్‌ కీలకం. ముఖ్యంగా పూర్తిగా లెక్కలు, అంకగణిత అంశాలతో ఉండే పేపర్‌2లో మంచి మార్కులు సాధించాలంటే.. ప్రాక్టీస్‌ తప్పనిసరి అని అభ్యర్థులు గుర్తించాలి. పేపర్‌2లో ప్రతి టాపిక్‌ను చదువుతూ వాటికి సంబంధించిన సిద్ధాంతాలను, సూత్రాలను, అప్లికేషన్స్‌ను, నిర్వచనాలను అవగాహన చేసుకోవాలి. వాటిని షార్ట్‌ నోట్స్‌ రూపంలో రాసుకుంటే.. రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. డీఏఓ పరీక్షలో మంచి మార్కులు సాధించి.. విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌6, 2022
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం
  • రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌
  • వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 09 Sep 2022 12:59PM

Photo Stories