Skip to main content

TSPSC Groups

నేను గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. మొదటిసారిగా గ్రూప్‌ 2 రాయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి?
+
  • గ్రూప్స్‌ అభ్యర్థులు లక్ష్యంపై స్పష్టతతో అడుగులు వేయాలి. అప్పుడే విజయం దక్కుతుంది. మీరు ముందుగా సిలబస్‌ అంశాలను పరిశీలించి.. వాటిలో మీకున్న నాలెడ్జ్‌ లెవల్‌ను తెలుసుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రిపరేషన్‌ సమయంలో సిలబస్‌కు అనుగుణంగా మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. అకాడమీ పుస్తకాలను అభ్యసించడం తప్పనిసరి అని గుర్తించాలి. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు.. తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి తెలంగాణ ప్రాంత ప్రాధాన్యం ఉన్న అంశాలకు అకాడమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. నా ప్రిపరేషన్‌ సమయంలో తెలుగు అకాడమీ పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వాటి ద్వారా పొందిన అవగాహనను తెలుసుకునేందుకు మోడల్‌ పేపర్స్‌ను ప్రాక్టీస్‌ చేశాను. 

    చదవండి: గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి
     
  • అభ్యర్థులు గుర్తించాల్సిన మరో విషయం.. గ్రూప్స్‌ సిలబస్‌ పూర్తి చేయాలంటే గంటల కొద్దీ చదవాలనే అభిప్రాయాన్ని వీడాలి. ఎంత సేపు చదివాం? అనే దాని కంటే చదివిన సమయంలో ఎంత ఏకాగ్రతతో ఆకళింపు చేసుకున్నాం..అనేది  ముఖ్యమని గుర్తించాలి. నా ఉద్దేశం ప్రకారం– డిగ్రీ స్థాయిలో అకడమిక్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా అన్ని సబ్జెక్ట్‌లలోనూ అవగాహన, నైపుణ్యం సొంతం చేసుకునేందుకు వీలవుతుంది.

    చదవండి: ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
     
  • ప్రిపరేషన్‌ పూర్తయిందనుకున్న తర్వాత మాక్‌ టెస్ట్‌లు లేదా మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. పోటీ పరీక్షల్లో విజయం దిశగా ఈ వ్యూహం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల మలిదశ ప్రిపరేషన్, అదే విధంగా పరీక్ష హాల్లో అనుసరించాల్సిన టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై స్పష్టత లభిస్తుంది. 

–ఎ.జంగయ్య, గ్రూప్‌–2 విజేత (ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌)
​​​​​​​

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

గ్రూప్స్‌లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రధానంగా చదవాల్సిన అంశాలేమిటి?
+
మానవాభివృద్ధి సూచిక (Human Development Index), అసమానతలు, సమన్యాయం, లింగ వివక్ష సూచీ, బహుమితీయ పేదరిక సూచీ (Multidimensional Poverty Index); మిలీనియం వృద్ధి లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు- వ్యూహాలు; ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులు, 11వ పంచవర్ష ప్రణాళిక విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు-ప్రగతి, వనరుల పంపిణీ; నీతి ఆయోగ్, పేదరికం- భావనలు- అంచనాలు, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు; నిరుద్యోగం-రకాలు, నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమాలు, శ్రామికశక్తి భాగస్వామ్యం, పనిలో పాలుపంచుకునే రేటు; జాతీయాదాయం-భావనలు, జాతీయాదాయ లెక్కింపులో సమస్యలు; పన్నుల వ్యవస్థ- పన్నుల సంస్కరణలు - వివిధ కమిటీలు, వస్తు సేవలపై పన్ను, కోశ విధానం; బ్యాంకింగ్ రంగం, ద్రవ్య మార్కెట్, ద్రవ్య విధానం, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు; వ్యవసాయ రంగం, హరిత విప్లవం, వ్యవసాయ పరపతి, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా వివిధ పంటల్లో రాష్ట్రాల స్థానం; పారిశ్రామిక తీర్మానాలు (1948, 1956, 1977, 1980, 1991), పారిశ్రామిక విత్త సంస్థలు; సేవా రంగం- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం; 2011 జనాభా లెక్కలు, డెమోగ్రాఫిక్ డివిడెండ్; ద్రవ్యోల్బణం - డబ్ల్యూపీఐ, సీపీఐ, ఐఐపీ, ద్రవ్యం; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు; ప్రపంచ వాణిజ్య సంస్థ; విదేశీ వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, చెల్లింపుల శేషం, మూల్యహీనీకరణ; ఆర్థిక సంస్కరణలు-సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ తదితర అంశాలను చదవాలి.
పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు ఎలా సిద్ధమవ్వాలి?
+
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రాచీన (Ancient), మధ్యయుగ (Medieval ), ఆధునిక (Modern) చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో సంస్కృతిని ప్రత్యేకంగా చదవాలి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలపై దృష్టిసారించాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్‌ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వా త భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్‌ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం తదితర అంశా లపై దృష్టిసారించాలి. జాతీయ ఉద్యమంలోని ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు ఎలా సిద్ధమవ్వాలి?
+
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి.. ప్రాచీన (Ancient), మధ్యయుగ (Medieva ), ఆధునిక (Modern) చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో సంస్కృతిని ప్రత్యేకంగా చదవాలి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలపై దృష్టిసారించాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్‌ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వా త భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్‌ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం తదితర అంశా లపై దృష్టిసారించాలి. జాతీయ ఉద్యమంలోని ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
పోటీపరీక్షల్లో ఇండియన్ ఎకానమీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
  • పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులు, సాధించిన వృద్ధి, ప్రణాళికా వ్యూహాలు, విజయాలు, వైఫల్యాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికా అంశాలపై దృష్టిసారించాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సంస్కరణల అమలుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి సడలింపు, వస్తు-సేవల పన్ను (GST) గురించి తెలుసుకోవాలి.
  • సమ్మిళిత వృద్ధి, పేదరికం, నిరుద్యోగ నిర్మూలన పథకాలు; వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల స్థితిగతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో సాంకేతికపరమైన సంస్కరణ విధానాలు, సంస్థాపరమైన సంస్కరణలు, మార్కెటింగ్, ధరలకు సంబంధించిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పారిశ్రామిక తీర్మానాల్లోని ముఖ్యాంశాలను పరిశీలించాలి. మానవాభివృద్ధి సూచీ రూపకల్పనలో వినియోగించే సూచికలు, ఆయా సూచికల విషయంలో భారతదేశానికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేయాలి.
  • ద్రవ్యం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణ రకాలు, ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం, ప్రతి ద్రవ్యోల్బణం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
  • ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను గమనించాలి. మూలధన కల్పనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు (కార్పొరేటు) రంగం, కుటుంబ రంగాల్లో వృద్ధిని పరిశీలించాలి.
  • జాతీయాదాయ భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయాదాయాన్ని మదించే పద్ధతులైన ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
  • ఆర్థిక సర్వే, బడ్జెట్ అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. దినపత్రికలను చదువుతూ ఆర్థిక రంగంలో రోజువారీ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యం.
పోటీ పరీక్షల్లో జీవ వైవిధ్యం, ఎకాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
ఎకాలజీ, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలపై వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఆవరణ శాస్త్ర పరిభాష, ప్రాథమిక అంశాలైన జీవుల అనుకూలనాలు (Adaptations), ఆవరణ వ్యవస్థ, రకాలు, ఆహార శృంఖాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ (Biogeo chemical cycles), ఆహార వల వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్యానికి సంబంధించి వాటి స్థాయి, రకాలు, జీవ వైవిధ్యానికి గల కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్, పరిరక్షణ పద్ధతులు, సమస్యలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. గతంలో ఈ విభాగంలో అడిగిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే.. దేశంలో రాబందుల సంఖ్య తగ్గడానికి కారణం? దీనికి సమాధానం.. పశువుల్లో అతిగా వాపు నివారణకు మందుగా ఉపయోగించే డై క్లోఫినాక్ అనే రసాయనం.

జీవ వైవిధ్యానికి ప్రమాదాలు అని ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల (వార్తల్లో అంశాలు)పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. బట్టమేక పక్షి (Great Indian Bustard)ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ (IUCN-The International Union for Conservation of Nature) క్రిటికిల్లీ ఎండేంజర్‌‌డ జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో సంబంధిత సమాచారాన్ని .. ఆ పక్షి విస్తరణ, దానికి ప్రత్యేకంగా ఏర్పడుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం-వంటి అంశాల ఆధారంగా సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే దృక్పథాన్ని ఇతర సంఘటనలకు అన్వయించుకోవడం ప్రయోజనకరం.
పోటీపరీక్షలో్ల పాలిటీలోని గవర్నెన్స్ అంశాలను ఎలా చదవాలి? రిఫరెన్స్పుస్తకాలను సూచించండి?
+
  • పాలన అంటే ప్రభుత్వ పనితీరు, నిర్వహణ. ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు గరిష్ట సేవలు అందించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా వచ్చినవే సుపరిపాలన, ఇ-పరిపాలన.
  • గతంలో ప్రభుత్వం అంటే కేవలం సంప్రదాయ శాసనాలు, వాటి అమలుకు పరిమితమై ఉండేది. కానీ, ప్రజలు నేడు ప్రభుత్వం కంటే పాలన కోరుకుంటున్నారు. అయితే ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి గరిష్ట, సత్వర ప్రామాణిక సేవలను కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే అందించలేవు. వాటికి తోడు పౌర సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సంస్థల సహకారం, సామాజిక బాధ్యత కూడా అవసరం. కాబట్టి సుపరిపాలనకు అవసరమయ్యే అంశాల స్వభావాన్ని, ఆవశ్యకతను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి.
  • పాలనలో నైతిక విలువల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాలనలో రాజకీయ జోక్యం.. ప్రభుత్వ అధికారులపై, ప్రజలకు అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అవినీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని అరికట్టాలంటే ప్రజలకు వారిని ప్రశ్నించే అవకాశమివ్వాలి. అందులో భాగంగా వచ్చినవే ఈ-పౌర, సిటిజెన్ చార్టర్లు, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రజావేగుల పాత్ర, ఆవశ్యకత, నిఘా సంస్థలైన లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం, రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ నివేదికలను జాగ్రత్తగా చదివి వాటి ప్రాముఖ్యతను విశ్లేషించుకోవాలి.
  • తేలిగ్గా, సత్వరం సేవలు అందించేందుకు సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ముఖ్యంగా ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఆధారిత సేవలు, ఇ-సేవ, మీ-సేవలు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను, పరిమితులపై దృష్టిసారించాలి.
రిఫరెన్స్ పుస్తకాలు...

 1. తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోని 'భారతదేశ పాలన' పాఠ్యపుస్తకం.
 2. యోజన తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు.
పోటీ పరీక్షలకు సంబంధించి చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి?
+
అభ్యర్థులు ముందుగా చరిత్ర అంటే రాజులు– యుద్ధాలు– ఘట్టాలు అనే పరిమితమైన దృక్పథాన్ని వీడాలి. దీనికి భిన్నంగా ఆయా రాజ వంశాల పరిపాలన, వాటి ఫలితాలు, అప్పటి ప్రజల జీవన విధానాలు, శిస్తు విధా నాలు, నిర్మాణాలపై విస్తృత దృక్పథంతో ముందుకు సాగాలి. సబ్జెక్టును ఆబ్జెక్టివ్‌ + సబ్జెక్టివ్‌ ప్రిపరేషన్‌ సాగించాలి. విజయనగర సామ్రాజ్యం, శాతవాహనులు, తూర్పు (వేంగీ) చాళుక్యులు, రెడ్డి రాజులు, ఇక్ష్వాక రాజ వంశాలు, ఆయా రాజుల కాలంలోని కళలు, సంసృృతి, కట్టడాల పరంగా అందించిన సేవలు, చేపట్టిన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. ఆధునిక భారత దేశ చరిత్రకు సంబంధించి ప్రధానంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలుగు ప్రాంత నాయకుల పాత్రను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో పత్రికలు, జన సంఘాల పాత్ర, వాటి ప్రభావం, వాటిని నడిపించిన వారి గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా  మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం ఆంధ్ర ప్రాంతంలో యూరోపియన్ల ప్రమేయం. యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతంలో చేసిన వ్యాపారాలు, అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఏ రాజుల కాలంలో ఎవరు ఎక్కువ వాణిజ్యం చేశారు అనే అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. గ్రూప్‌–1, 2, 3 ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు ఎప్పటికప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌ రాసుకోవాలి. గ్రూప్‌–1 కోణంలో ఆ పాయింట్లను విశ్లేషించుకుంటూ వివరణాత్మక దృక్పథంతో చదవాలి.
పోటీ పరీక్షలకు సంబంధించి ‘పట్టణ నిరుద్యోగం–నిర్మూలన చర్యలు’ గురించి తెలియజేయండి.
+
  • పారిశ్రామిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పట్టణ నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. తక్కువ వ్యయంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ, ఆధునికీకరణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
  • ముఖ్యంగా ఇనుము, ఉక్కు, రసాయనాలు, రక్షణ వస్తువులు, హెవీ మిషనరీ, విద్యుదుత్పాదన, అణుశక్తికి సంబంధించిన పరిశ్రమల ఆధునికీకరణ, విస్తరణపై దృష్టి సారించాలి. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
  • విద్యార్థులను సాధారణ విద్య నుంచి వృత్తి విద్య వైపు మరల్చాలి. తద్వారా యువత స్వయం ఉపాధి దిశగా దృష్టి కేంద్రీకరించగలుగుతుంది.
  • శ్రమ–సాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించే చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాలి.
  • పట్టణ అసంఘటిత రంగంలో అనేక మంది ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధిపరచడం, ఆధునికీకరించడానికి తగిన చర్యలు చేపట్టాలి. ఫలితంగా పెరుగుతున్న పట్టణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
  • షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంకులు ప్రత్యేకంగా రిటైల్‌ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ వడ్డీకి పరపతిని అందించాలి. అర్బన్‌ అసంఘటిత రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేవా రంగానికి సంబంధించి అనేక యూనిట్లను అభివృద్ధి చేయాలి. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతపరచాలి.
  • గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న కారణంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికమవుతోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు కూడా పెరిగి మౌలిక సౌకర్యాల కొరత ఏర్పడుతోంది.
తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?
+
1956 తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత స్థితిగతులను పరిశీలించాలి. ముఖ్యంగా జీఎస్‌డీపీలో వివిధ రంగాల వాటా, శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రాంతీయ అసమానతలను విశ్లేషించుకోవాలి. జల, ఆర్థిక తదితర అంశాల అసమానతలకు సంబంధించిన సమాచారాన్ని సిలబస్‌లో పేర్కొన్న వివిధ కమిటీల నివేదికల నుంచి సేకరించుకోవాలి.
  • తెలంగాణ ఎకానమీలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం భూ సంస్కరణలు. మొదటి దశ భూ సంస్కరణల లక్ష్యాలు, హైదరాబాద్‌ రాష్ట్రంలోని భూస్వామ్య విధానాలు, కౌలు విధానాలను పరిశీలించాలి. కమతాలపై గరిష్ట పరిమితికి సంబంధించి జాతీయ మార్గదర్శక సూత్రాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రాంతంలో భూసంస్కరణలకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాల వివరాల గురించి తెలుసుకోవాలి.
  • తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగ స్థితిగతులను ముఖ్యంగా పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యవసాయ పరపతి, నీటి పారుదల, ఎరువుల వినియోగం తదితర అంశాలను పరిశీలించాలి.
  • తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటాలను అధ్యయనం చేయాలి. కొత్త ప్రభుత్వం ఈ రంగాల అభివృద్ధికి చేపట్టిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. రుణ మాఫీ టి కార్యక్రమాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
  • భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ప్రగతిపై అవగాహన అవసరం. జిల్లాల వారీగా వివిధ పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతోపాటు భారీ పారిశ్రామికీకరణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన అవసరం.
రిఫరెన్స్‌ ..
1. తెలంగాణ సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌  
2. శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
3. తెలుగు అకాడమీ: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పుస్తకం.
పోటీ పరీక్షల్లో జాతీయాదాయం, విదేశీ వాణిజ్యం, పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి, ద్రవ్యోల్బణం విభాగాల ముఖ్యాంశాలను తెలపండి?
+
జాతీయాదాయం: స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం, కేంద్ర గణాంక సంస్థ, జాతీయాదాయం-మానవ శ్రేయస్సు, ఆదాయ అసమానతలు, ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులు.

విదేశీ వాణిజ్యం:
వాణిజ్య శేషం, చెల్లింపుల శేషం, వర్తక నిబంధనలు, విదేశీ మారక ద్రవ్యం, వాణిజ్య విధానం, మూల్యహీనీకరణ, రీ వాల్యుయేషన్, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, అప్రెసియేషన్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఎల్‌ఈఆర్‌ఎమ్‌ఎస్, హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ, హాట్ కరెన్సీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్.

పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి:
మానవాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఉపాధి, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, సాంఘిక భద్రత, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, పట్టణ మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి.

ద్ర వ్యోల్బణం:
ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఫిలిప్స్ రేఖ, టోకు ధరల సూచీ, వినియోగదారుని ధరల సూచీ, స్టాగ్ ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.
టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది?
+
సిలబస్‌లో పొందుపరచిన అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలుపై పట్టు సాధించాలి. ప్రశ్నల స్థాయి ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుని తార్కికంగా, విశ్లేషణాత్మకంగా, విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; విషయ అవగాహనకు సంబంధించినవి, విషయ అనువర్తనకు సంబంధించినవి.

జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి:
ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది.

విషయ అవగాహనకు సంబంధించినవి:
కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాని చెప్పొచ్చు.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
కోచింగ్‌ తీసుకోకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా?
+
స్వీయ సామర్థ్యాన్ని విశ్లేషించుకొని ఒక పరీక్షకు శిక్షణ తీసుకోవాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే సొంత ప్రిపరేషన్‌తో విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారు. పూర్తిస్థాయి కోచింగ్‌ లేకుండా సివిల్స్‌లో సైతం సక్సెస్‌ను అందుకున్న వారు ఉన్నారు. అయితే స్వీయ సన్నద్ధతతో పరీక్షలు రాయాలనుకునే వారికి ఆత్మవిశ్వాసం, ఎలాగైనా విజయం సాధించాలనే తపన, పటిష్ట ప్రణాళిక, కష్టపడేతత్వం ఉండాలి. ఒక్క పోస్టు ఉన్న నోటిఫికేషన్‌కైనా పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టుదలతో చదివితే తప్ప విజయం సాధ్యంకాదు. తొలుత లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు గ్రూప్‌–2 లక్ష్యమైతే.. తొలుత పేపర్ల వారీగా సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఆపై గత విజేతలు, తెలిసిన ఫ్యాకల్టీ సహాయంతో ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తూ, ఏ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. ప్రశ్నలు అడుగుతున్న సరళినీ అర్థం చేసుకోవాలి. తర్వాత రోజువారీ పూర్తిచేయాల్సిన అంశాలతో టైంటేబుల్‌ రూపొందించుకోవాలి. చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా ఒక పుస్తకంలో షార్ట్‌నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. ఈ నోట్స్‌ను వారానికి ఒకసారి మళ్లీ చదవాలి. అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా, ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌ సాగుతున్న తీరుపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం సబ్జెక్టుల వారీగా మాక్‌టెస్ట్‌లు రాయడం ముఖ్యం. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్‌ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను స్నేహితులు లేదా తెలిసిన ఫ్యాకల్టీ సహాయంతో ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ‘సాక్షి’ భవిత, విద్య పేజీలు; www.sakshieducation.com  ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి. ఎస్‌ఐ తరహా పోస్టులకు సిద్ధమవాలనుకుంటే సబ్జెక్టుల ప్రిపరేషన్‌తో పాటు ఈవెంట్లకు కూడా ప్రాధాన్యమివ్వాలి.
పోటీపరీక్షల కోసం అంతరిక్ష రంగానికి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+

అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇస్రో చేపట్టిన ముఖ్య ప్రయోగాల (చంద్రయాన్, మంగళ్‌యాన్‌ తదితర)పై అవగాహన పెంపొందించుకోవాలి. ఆయా ప్రయోగాల ప్రస్తుత పరిస్థితి, ఫలితాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అవి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతున్న తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి పూర్తిసమాచారాన్ని తెలుసుకోవాలి.

ఉదాహరణకు 2017, జూన్‌ 5న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3–డీ1/జీశాట్‌–19 ప్రయోగానికి సంబంధించి అభ్యర్థులు పరిశీలించాల్సిన అంశాలు..
లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌: 3136 కిలోలు;
మిషన్‌ జీవితకాలం: పదేళ్లు;
వాహక నౌక: జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 డీ1;
ఉపగ్రహ రకం: కమ్యూనికేషన్‌;
కక్ష్య రకం: జియో సింక్రోనస్‌ ఆర్బిట్‌ (జీఎస్‌వో).

వాహక నౌకల అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ: ఎత్తు–44 మీటర్లు, వ్యాసం–2.8 మీటర్లు, దశలు–4, లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌–320 టన్నులు (ఎక్స్‌ఎల్‌); జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ: ఎత్తు–49.13 మీటర్లు, దశలు–3, లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌–414.75 టన్నులు); జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3: ఎత్తు–43.43 మీటర్లు, వ్యాసం–4 మీటర్లు, ఉష్ణ కవచం వ్యాసం–5 మీటర్లు, దశలు–3, లిఫ్ట్‌ ఆఫ్‌ మాస్‌–640 టన్నులు. అదే విధంగా పునర్వినియోగ వాహక నౌక–టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) గురించి తెలుసుకోవాలి.

వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, విద్య, పౌర విమానయానం, పర్యావరణం తదితర రంగాల్లో అంతరిక్ష కార్యక్రమాల అనువర్తనాలను తెలుసుకోవాలి. ఉదాహరణ: ఎర్త్‌ అబ్జర్వేషన్‌ అనువర్తనాల ద్వారా పంట ఉత్పత్తులను అంచనా వేయొచ్చు. అదే విధంగా సాయిల్‌ మ్యాపింగ్‌ చేయొచ్చు.

ఇస్రో తన కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిపై అవగాహన అవసరం. ఆయా కేంద్రాలు, నెలకొన్న ప్రాంతాలు, కేంద్రాల విధులను తెలుసుకోవాలి. ఉదాహరణకు అహ్మదాబాద్‌లో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ), ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌); డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌ యూనిట్‌ (డీఈసీయూ) ఉన్నాయి.
అభ్యర్థులు ప్రిపరేషన్‌కు  www.isro.gov.in ను ఉపయోగించుకోవాలి.

గ్రూప్స్, ఎస్‌ఐ వంటి పోటీ తీవ్రంగా ఉండే పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి?
+
పోటీ పరీక్షల్లో విజయానికి పటిష్ట ప్రణాళిక అవసరం. గ్రూప్స్ ఔత్సాహికులు రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోవాలి. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ తదితర అంశాలను రోజూ చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే పూర్తిచేయాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో షార్ట్‌నోట్స్‌ను తయారు చేసుకోవాలి. ఈ నోట్స్‌లోని అంశాలు ముఖ్యమైనవి కాబట్టి ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో చాలాముఖ్యమైన అంశాలను షార్ట్‌కట్ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు క్విక్ రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది.
  • పరీక్ష ఏదైనా అందులో విజయం సాధించాలంటే రివిజన్ చాలా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, పరీక్షకు ముందు రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి.
  • చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం పూర్తయ్యాక పేపర్ల వారీగా మోడల్ టెస్ట్‌లు రాయాలి. స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. బలహీనంగా ఉన్న అంశాలకు అధిక సమయం కేటాయించి, వాటిపైనా పట్టు సాధించాలి. పరీక్షకు ముందు వీలైనన్ని గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మరవొద్దు.
  • పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించడానికి గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. వీలైన సమయాల్లో అభ్యర్థులు తమ స్నేహితులతో కలిసి చదవాలి. వివిధ అంశాలపై చర్చించాలి. ఒకరికి తెలియని అంశాలను మరొకరితో పంచుకోవాలి.
  • నేటి పోటీపరీక్షల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మరో ముఖ్యాంశం.. సబ్జెక్టులను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఇది చాలా ముఖ్యం.
  • సబ్జెక్టులను ప్రిపేరవుతున్నా, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తున్నా.. ప్రిపరేషన్ ఏ దశలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఏవైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఏవైనా సందేహాలుంటే బిడియపడకుండా ఫ్యాకల్టీని అడిగి, నివృత్తి చేసుకోవాలి.
రైల్వే టెక్నికల్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను. జనరల్ సైన్స్, టెక్నికల్ ఎబిలిటీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
  •  సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) ప్రశ్నపత్రంలో జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇంటర్ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, బయాలజీ ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించొచ్చు. జేఈ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. ప్రతి చాప్టర్‌లోని ముఖ్య భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • టెక్నికల్ ఎబిలిటీ: ఎస్‌ఎస్‌ఈ ప్రశ్నపత్రంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెజర్‌మెంట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్/గ్రాఫిక్స్‌పై ప్రశ్నలుంటాయి. జేఈకి కూడా ఇవే అంశాలపై ప్రశ్నలుంటాయి. కానీ, ప్రశ్నల క్లిష్టతా స్థాయి తక్కువగా ఉంటుంది. 
  • ఉద్యోగ సాధనకు మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి మరికొన్ని ఇతర బ్రాంచ్‌లకు సంబంధించిన అంశాలపైనా పట్టుసాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెకానికల్ గ్రాడ్యుయేట్‌కు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. అందువల్ల ఓ ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను అనుసరించి వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
  • ఎలక్ట్రికల్‌లో ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, బేసిక్ సర్క్యూట్ల అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్, సర్క్యూట్లు, కమ్యూనికేషన్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.  

కంప్యూటర్స్‌కు సంబంధించి సి, జావా, డీబీఎంఎస్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సివిల్‌లో స్ట్రెన్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్వేయింగ్ అంశాలు ముఖ్యమైనవి. మెకానికల్‌లో థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, హీట్ ఇంజన్స్ అంశాలు ప్రధానమైనవి. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ట్రాన్స్‌డ్యూసర్స్, కంట్రోల్ సిస్టమ్స్ అంశాలు ముఖ్యమైనవి.

పోటీపరీక్షల్లో పర్యావరణం (environment) అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
వాతావరణ మార్పులు, భూతాపం నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పరీక్షల్లో పర్యావరణం, సంబంధిత అంశాలకు సిలబస్‌లో చోటుకల్పించారు. పోటీపరీక్షల ఔత్సాహికులు ప్రధానంగా ఈ కింది అంశాలపై దృష్టిసారించాలి.
  • థియరీ అంశాలు: పర్యావరణం, జీవవైవిధ్యం.
  • అంతర్జాతీయ కార్యక్రమాలు, ఒప్పందాలు, సదస్సులు.
  • భారత్‌లోని పర్యావరణ సంస్థలు, కమిటీలు, నివేదికలు.
  • శక్తి వనరులు, కాలుష్యం.
  • వృక్ష, జంతుజాలం, పరిరక్షణ.
  • సహజ విపత్తులు.
  • వ్యవసాయం–పర్యావరణం మధ్య సంబంధం.
  • వీటి అధ్యయనానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు ఉపయోగించుకోవాలి. దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో పొందుపరచుకోవాలి. రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరచిన అంశాలను పరిశీలించాలి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను కూడా రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవాలి.
  • ఒకవైపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి పథంలో పయనిస్తున్న మనిషి.. అదే క్రమంలో పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే భవిష్యత్‌ తరాల మనుగడే ప్రశ్నార్థకమనే విషయాన్ని గుర్తెరిగి, నడుచుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాకారమవుతుంది. అభ్యర్థులు పర్యావరణానికి ఏ విధంగా నష్టం జరుగుతోంది? దాని పర్యవసానాలు ఏమిటి? అనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలి.
  • సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవాలి.
  • ఫుడ్‌చైన్, ఫుడ్‌వెబ్, డీడీటీ–బయోమ్యాగ్నిఫికేషన్, బయోటిక్‌ ఫొటెన్షియల్‌ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటికోసం ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) మెటీరియల్‌ను ఉపయోగించుకోవచ్చు.
  • గత కాప్‌ (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌) సదస్సుల తీర్మానాలను తెలుసుకోవాలి.
పోటీ పరీక్షల్లో జడవాయువులపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వీటికోసం ఎలా సన్నద్ధమవ్వాలి?
+
పోటీ పరీక్షల్లో వివిధ మూలకాలు, వాటి ఉపయోగాలకు సంబంధించిన ప్రశ్నలను తరచుగా అడుగుతున్నారు. మూలకాలను వివిధ కుటుంబాలుగా విభజించారు. వీటిలో జడవాయువులు అనే కుటుంబం ఒకటి. గతంలో ఈ చాప్టర్‌పై చాలా పరీక్షల్లో ప్రశ్నలు అడిగారు. అందువల్ల మూలకాల పేర్లు, వాటి ఉనికి, ఆవిష్కరణ, వివిధ క్షేత్రాల్లో వాటి అనువర్తనాలు తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. గతంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జడవాయు కుటుంబంలోని మూలకాల పేర్లపై కింది ప్రశ్న అడిగారు.

ప్రశ్న: కిందివాటిలో జడవాయువు కానిదేది?
  1. ఆర్గాన్
  2. హీలియం
  3. బ్రోమిన్
  4. క్రిప్టాన్

ఇచ్చిన ఆప్షన్లలో ‘బ్రోమిన్’ సరైన సమాధానం. ఇది జడవాయు కుటుంబానికి పక్కనే ఉన్న హాలోజన్లకు చెందింది.
‘గజ ఈతగాళ్లు సముద్ర లోతుల్లో శ్వాస కోసం ఉపయోగించే వాయు మిశ్రమంలో నైట్రోజన్ బదులు హీలియంను ఎందుకు ఉపయోగిస్తారు?’ అనే ప్రశ్న రావొచ్చు. అధిక పీడనం వద్ద నైట్రోజన్ రక్తంలో కరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించరు. అదేవిధంగా నియాన్ లైట్లలో వివిధ రంగుల కాంతి గురించి ప్రశ్నలు అడగవచ్చు. అందువల్ల ఈ అంశాలన్నింటిపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. వీటి కోసం ఇంటర్మీడియెట్ రసాయనశాస్త్రం పాఠ్యపుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
పోటీ పరీక్షల్లో ఇండియన్ పాలిటీ అంశాలకు ఎలా ప్రిపేర్కావాలి?
+
1. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర పరీక్షల్లో భారత రాజకీయ వ్యవస్థ (Indian Polity)కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన చట్టాలు, ఆర్డినెన్స్‌లు, ప్రభుత్వ విధానాలు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రాజ్యాంగ సవరణల (ఉదా: THE CONSTITUTION (ONE HUNDRED AND FIRST AMENDMENT) ACT, 2016)పై తప్పనిసరిగా దృష్టిసారించాలి. ఈ సవరణ చట్టం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించింది.
2. ముఖ్యమైన రాజ్యాంగ అధికరణలపై పట్టు సాధించాలి. దేశంలో ముఖ్య వ్యవస్థలకు సారథ్యం వహిస్తున్న వారి పేర్లను తెలుసుకోవాలి. ఉదా: ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్-అచల్ కుమార్ జ్యోతి. అదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి; సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో పనిచేస్తున్న ప్రధాన సమాచార కమిషనర్, వివిధ స్థాయీ సంఘాల (పార్లమెంట్/అసెంబ్లీ) అధ్యక్షుల పేర్లు తదితరాలను తెలుసుకోవాలి.
3. రాజ్యాంగ పరిషత్ ఎన్నిక విధానం, ముఖ్య కమిటీల అధ్యక్షులు, పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం (పీఠికకు మూలం), ప్రధాన షెడ్యూళ్లు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ/విధాన పరిషత్‌లకు ఎన్నిక విధానం; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి; ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్లు, వాటి విధులు, ఆయా కమిషన్ల అధ్యక్షుల వివరాలను తెలుసుకోవాలి.

రిఫరెన్స్:
  • లక్ష్మీకాంత్ పుస్తకం.
  • బీఏ ద్వితీయ సంవత్సరం రాజనీతి శాస్త్రం.
  • బీఏ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పాలన.
  • వార్తా పత్రికలు, మేగజీన్లు.
పోటీపరీక్షల్లో పర్యావరణంతో ముడిపడిన అర్థశాస్త్ర అంశాలకు ఎలా ప్రిపేర్‌కావాలి?
+
  1. పర్యావరణ అర్థశాస్త్రం (Environmental Economics).. మానవాభివృద్ధికి, పర్యావరణానికి మధ్యగల అంతర్గత సంబంధాన్ని వివరిస్తుంది. అధిక ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు వివిధ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు రూపొందించాల్సిన పథకాలు, ఆయా పథకాల అమలుకు తీసుకోవాల్సిన ఆర్థిక నిర్ణయాలను పర్యావరణ అర్థశాస్త్రం చర్చిస్తుంది. వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
  2. వస్తువుల ఉత్పత్తిని పెంచటం ద్వారా గరిష్ట లాభాలు ఆర్జించాలంటే పర్యావరణ వనరులను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అర్థశాస్త్ర విభాగాలైన నిశ్చయాత్మక, ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రాలు.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల మధ్య అంతర్గత సంబంధాన్ని విశ్లేషిస్తాయి. పర్యావరణ ఆస్తులపై ఆర్థిక కార్యకలాపాల ప్రభావాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం తెలుపుతుంది. అయితే ఇది ఎలాంటి తీర్పులు ఇవ్వదు. ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం మాత్రం పర్యావరణ వస్తువులను దోపిడీ చేస్తూ, జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం సమంజసమా? అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. పర్యావరణ సమతుల్యతకు చేసే పథకాల రచన వల్ల కలిగే లాభనష్టాలు, నష్టాల నివారణకు అనుసరించే మార్గాలు ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి. ఆయా అంశాలను సమకాలీన పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
  3. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించటం, అధిక పారిశ్రామికీకరణ కారణంగా శీతోష్ణస్థితి, వాతావరణం మార్పు చెందుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో వివిధ రంగాలకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేయాలి. అడవుల విస్తరణ, విస్తీర్ణాన్ని సాధించాల్సిన లక్ష్యాలు, వాటి సాధనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  4. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికాబద్ద ఆర్థిక ప్రగతిలో భాగంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. జాతీయాదాయం, తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో అధిక ప్రగతి నమోదైంది. దేశంలో సహజ వనరుల వినియోగంలో విచక్షణ పాటించకపోవటం, పునరుత్పన్నం కాని వనరులను ఇష్టానుసారం ఉపయోగించటం, పర్యావరణ-జీవ వైవిధ్యం ప్రాధాన్యతను గుర్తించకపోవటం వల్ల దేశంలో పర్యావరణ తులారాహిత్యం పెరుగుతోంది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత్ వాటా తక్కువగా ఉన్నప్పటికీ, పారిశ్రామిక కాలుష్యాలైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దేశానికి అధిక వాటా ఉండటం గమనించాల్సిన అంశం.
  5. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన జనాభాలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఈ దేశాల్లో గ్రామీణ జనాభా రెట్టింపై, పర్యావరణ పరిరక్షణకు సవాలుగా పరిణమించింది. పట్టణ జనాభా వృద్ధి కారణంగా మౌలిక వసతుల కల్పనపై ఒత్తిడి పెరిగింది. అదే విధంగా కాలుష్యం పెరగడంతో పర్యావరణ క్షీణత ఏర్పడింది. ఒకే పంటను ఎక్కువసార్లు పండించటం, పురుగు మందుల అధిక వినియోగం కారణంగా భూసారం తగ్గింది. భూమి కోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, గుంతల్లో వ్యర్థాలను పూడ్చటం వంటి వాటివల్ల భూమి నాణ్యత క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల విధానపర చర్యలను తెలుసుకోవాలి.
  6. ప్రపంచ వ్యాప్తంగా మానవ కార్యకలాపాలు, భారీ పారిశ్రామికీకరణ ప్రక్రియ.. పర్యావరణ సమతుల్య సాధనకు అవరోధంగా నిలిచాయి. పర్యావరణ తులారాహిత్యానికి సంబంధించి పరిమాణాత్మక, ద్రవ్యపరమైన అంచనాలను రూపొందించటం కష్టతరమైనప్పటికీ, ఇటీవల కాలంలో కొన్ని దేశాలకు ఈ రకమైన అంచనాలు వెలువడ్డాయి. వీటిపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు విడుదల చేసిన నివేదికల్లోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి.
  7. శ్రేయస్సును కొలవటంలో స్థూలజాతీయోత్పత్తి అంచనాలు ఎంతవరకు ఉపకరిస్తాయనే విషయంలో ఆర్థిక వేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు సందేహాలు వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఆర్థికాభివృద్ధి, జాతీయ శ్రేయస్సును కొలిచేందుకు జీఎన్‌పీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ జీఎన్‌పీ కొలమానం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధ్యయనం చేయాలి.
టీఎస్‌పీఎస్సీ ఫారెస్ట్ జాబ్స్, డీఎస్సీలో జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
  • డీఎస్సీతో పాటు వివిధ పోటీపరీక్షలకు జీకే, కరెంట్ అఫైర్స్ ముఖ్యవిభాగం. సాధారణంగా ఈ విభాగంలో భిన్న అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవి..
  • వార్తల్లో వ్యక్తులు (వివిధ సంస్థల కీలక పదవుల్లో కొత్తగా నియమితులైనవారు); అవార్డుల విజేతలు (నోబెల్ ప్రైజ్, బుకర్ ప్రైజ్, మెగసెసె ప్రైజ్ తదితరాల విజేతలు); క్రీడలు (క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర క్రీడల పోటీల విజేతలు-వేదికలు..); రక్షణ రంగం (క్షిపణులు, వాటి పరిధి-రక్షణ ఒప్పందాలు; యుద్ధ నౌకలు, రక్షణ సంస్థలు వంటివి); అణు ఇంధన రంగం (అణువిద్యుత్ ప్లాంట్లు-నెలకొన్న ప్రాంతాలు-సామర్థ్యం); పాలిటీ (రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన బిల్లులు, చట్టాలు, ఎన్నికలు..); ఆర్థిక రంగం (ముఖ్య సూచీలు, బడ్జెట్-ఆర్థిక సర్వే గణాంకాలు, జనాభా వివరాలు..), పర్యావరణం, ఆవరణ శాస్త్రం (ముఖ్య సదస్సులు, రక్షిత ప్రాంతాలు, వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంతాలు, కాలుష్యం..); సదస్సులు, సమావేశాలు (బ్రిక్స్, కామన్వెల్త్, జీ-20..); జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఉపగ్రహ ప్రయోగాలు, ముఖ్య ఆవిష్కరణలు..), ఇటీవల విడుదలైన ముఖ్య పుస్తకాలు-రచయితలు.
  • అదే విధంగా దేశంలో భౌగోళిక ప్రాంతాలు, సహజ వనరుల విస్తరణ; నదీ వ్యవస్థ, రవాణా వ్యవస్థ వంటి అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. జాగ్రఫీ అంశాలను తేలిగ్గా అధ్యయనం చేయడానికి అట్లాస్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి.
  • రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికార మాసపత్రికను, పోర్టల్ (https://www.ap.gov.in OR https://www.telangana.gov.in )ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
  • ఈ మధ్యకాలంలో స్టాక్ జీకే కంటే కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నందున రోజూ తప్పనిసరిగా పత్రికలు చదవడంతో పాటు ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి విపత్తు నిర్వహణ
(disaster management)అంశాలను ఎలా చదవాలి?
+
సాధారణ మానవ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ.. అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపదను విపత్తుగా నిర్వచించవచ్చు. 2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ కార్యకలాపాల వల్ల లేదంటే ప్రమాదవశాత్తు సంభవించి.. ఆ ప్రాంతం కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవాన్ని కూడా విపత్తుగా నిర్వచించొచ్చు. విపత్తుకు సంబంధించి ఇలాంటి నిర్వచనాలపై దృష్టిసారించాలి. వివిధ రకాల (భూకంపాలు, సునామీలు, కరవులు తదితర) విపత్తులను అధ్యయనం చేయాలి. దేశంలోని విపత్తు నిర్వహణ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలి.

విపత్తు నిర్వహణ చట్టం-2005లోని ముఖ్యాంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రధానమంత్రి అధ్యక్షతన 2005, మే 30న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను మొదట ఏర్పాటు చేశారు. ఈ సంస్థ చేపడుతున్న విపత్తు కార్యక్రమాలను తెలుసుకోవాలి. అదేవిధంగా విపత్తులను ఎదుర్కొనేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్‌‌స (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స (సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్‌‌స (సీఐఎస్‌ఎఫ్), ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమబల్ (ఎస్‌ఎస్‌బీ) నుంచిజాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 44 కింద ఏర్పాటు చేసిన ఈ దళాలు 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్నాయి. అభ్యర్థులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్లు- అవి ఉన్న ప్రాంతాలను తెలుసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ యంత్రాంగంపై అవగాహన పెంపొందించుకోవాలి. భూకంప మండలాలు, విపత్తులు-ఉపశమన చర్యలు, విపత్తులకు కారణాలు-పర్యవసానాలు, నష్టనివారణ చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, https://www.ndma.gov.in/en/ లను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు.
గ్రూప్-2కు ఎలాంటి ప్రిపరేషన్ వల్ల మంచి ఫలితాలుంటాయి?
+
మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉండే గ్రూప్-2 పరీక్ష విషయంలో అధిక శాతం మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు సిలబస్‌లోని అంశాలను నేరుగా బిట్స్ రూపంలో చదవడం. ఇది ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. దీనివల్ల ఒక అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం ఇవ్వగల సామర్థ్యం లభిస్తుంది. డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు అభ్యర్థులు ముఖ్యాంశాలను పాయింటర్స్‌లా లేదా షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఫలితంగా రివిజన్ చేసేటప్పుడు సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్‌లలో షార్‌‌టకట్ నోట్స్ విధానం ఎంతో అవసరం.

అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా, తాము అప్పటివరకు చదివిన అంశాలపై ఏ మేరకు పట్టు సాధించామనే దానిపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం స్వయంగా మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. పేపర్ల వారీగా వారాంతపు పరీక్షలకు హాజరుకావడం విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. వారం రోజుల్లో చదివిన అంశాలకు సంబంధించి టెస్ట్ రాయడం, ఫలితాలను విశ్లేషించుకోవడం చేయాలి. ఒక అంశాన్ని కేవలం థియరిటికల్ అప్రోచ్‌తో చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్ చేయాలి.
గ్రూప్-2 పేపర్-4లోని తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
సెక్షన్-1లోని ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారితీసిన పరిస్థితులు. ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, ముఖ్యమైన పరిణామాలు, భూదానోద్యమ ముఖ్య పరిణామాలు- కారణమైన పరిస్థితులు, పెద్ద మనుషుల ఒప్పదం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు, 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన సంఘటనల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

సెక్షన్-2 గా పేర్కొన్న సమీకరణ దశ (1971-1990)కు సంబంధించి ముఖ్యమైన అంశాలు.. జై ఆంధ్ర ఉద్యమం, ఆరు సూత్రాల పథకం, తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/ పార్టీలు, ముల్కీ ఉద్యమాలు, నిబంధనలు వంటి వాటిపై అధ్యయనం చేయాలి.

సెక్షన్-3లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా పార్టీల ఏర్పాటు-అందుకు దారితీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలను అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల నివేదికలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలు.
గ్రూప్-2, పేపర్-2లోని భారత్, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక అంశాలకు ఎలా సిద్ధమవాలి?
+
ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండిటినీ మూడు భాగాలుగా (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక) విభజించుకుని చదవాలి. ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. వలసవాదం దశలు, 1857 తిరుగుబాటు ప్రభావం, భారతదేశంలో జాతీయవాదం పెరుగుదల, గాంధీ శకం ప్రాధాన్యం, దేశ స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలకు ప్రాధాన్యమివ్వాలి.
  • సింధు నాగరికత, వేదకాలం నాగరికత, మతపరమైన ఉద్యమాలు (బౌద్ధం, జైనం తదితర), ఇస్లాం మతం-ప్రభావం, భక్తి ఉద్యమాలు-స్వభావం, లలిత కళలు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను బాగా చదవాలి.
  • తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రల్లో ఆయా రాజ్య వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి, పరిస్థితులపై అవగాహన (ఉదా.. కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటిపారుదల వ్యవస్థ) పెంపొందించుకోవాలి.
  • ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తులు-విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి చర్యలు (ఉదాహరణకు విద్యారంగం, పారిశ్రామిక అభివృద్ధి). అసఫ్‌జాహీల కాలంలో ప్రధాన ఉద్యమాలైన ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
గ్రూప్ - 1 జనరల్ ఎస్సేలో ‘విద్య, మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశానికి ఎలా సన్నద్ధమవ్వాలి?
+

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్ - 1 జనరల్ ఎస్సే కొత్త సిలబస్‌లో సరికొత్త అంశం ‘విద్య, మానవ వనరుల అభివృద్ధి (జనరల్ ఎస్సే సెక్షన్-3)’. సామాజిక అభివృద్ధికి, దేశ ప్రగతికి పునాదులు విద్య, మానవ వనరులే అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని సిలబస్‌లో పొందుపర్చినట్లు చెప్పొచ్చు. ఈ విభాగానికి సంబంధించి ప్రిపరేషన్ సాగించే క్రమంలో.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న పలు విద్యాభివృద్ధి పథకాల (ఉదాహరణ రైట్ టు ఎడ్యుకేషన్; సర్వ శిక్ష అభియాన్)తోపాటు మానవ వనరుల అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు (ఉదా: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్; సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఏర్పాటు) గురించి తెలుసుకోవాలి. వాటి ఉద్దేశాలు - లక్ష్యాలు - ఇప్పటివరకు సాధించిన ప్రగతి తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో తెలంగాణ ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య, గురుకుల విద్యా విధానాన్ని, అన్ని గురుకుల విద్యా సంస్థలను ఒకే నియంత్రణ సంస్థ పరిధిలోకి వచ్చే విధంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు అన్ని వర్గాల విద్యార్థులను ఉన్నత విద్య దిశగా నడిపించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలపై అవగాహన అవసరం.

గ్రూప్ - 2 పేపర్ - 3లోనిమూడో విభాగంలో ‘ఇష్యూస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చేంజ్’ అనే అంశానికి ఎలా సన్నద్ధమవ్వాలి?
+
 గ్రూప్ - 2లో ఎకానమీ సిలబస్‌ను మూడు సెక్షన్లుగా విభజించారు. ప్రతి సెక్షన్‌లో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ నుంచి 50 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. దీంట్లో భాగంగా ‘అభివృద్ధి, మార్పు - సమస్యలు’ అనే విభాగం మూడో సెక్షన్‌గా ఉంది. ఇందులో ముఖ్యంగా దేశంలోని ప్రాంతీయ, సామాజిక అసమానతలు; కుల, మత, లింగ వివక్షతలు, వలస, పట్టణీకరణ తదితర అంశాలను చదవాలి. భూసేకరణ విధానం, పునారావాసం; ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అభివృద్ధి, పేదరికం, అసమానతలు, విద్య, వైద్య రంగంలో సామాజిక అభివృద్ధి, సోషల్ సెక్యూరిటీ లాంటివాటిని అధ్యయనం చేయాలి. సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? దీని కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఇటీవల పారిస్‌లో కుదిరిన ఒప్పందం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రయోజనకరం.
గ్రూప్-1 పేపర్ 4లోని మూడో విభాగమైన ‘అభివృద్ధి,పర్యావరణ సమస్యలు’ అనే అంశాన్ని ఎలా చదవాలి?
+
గ్రూప్ - 1 నాలుగో పేపర్‌లోని మూడో సెక్షన్ అభివృద్ధి, పర్యావరణ సమస్యలు. ఈ విభాగానికి ప్రిపరేషన్ సాగించే క్రమంలో అభ్యర్థులు పర్యావరణం నిర్వచనం నుంచి పర్యావరణ కాలుష్య నివారణ దిశగా తాజాగా కుదిరిన పారిస్ ఒప్పందం వరకూ... అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. పర్యావరణ సమస్యలు ప్రస్తావిస్తూనే.. ఆర్థిక అంశాలైన ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామిక అభివృద్ధి లాంటి వాటి గురించి ప్రశ్నించవచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై తప్పనిసరిగా దృష్టి సారించాలి. పర్యావరణానికి దోహదపడే అటవీ వనరులు; సహజ వనరులు, వాటి రక్షణ దిశగా చేసిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పర్యావరణ సమస్యకు దారితీస్తున్న పరిశ్రమలు, సహజ వనరుల సంపదకు ఆటంకం కలిగిస్తున్న గనుల తవ్వకాలు తదితర సమస్యలపై అవగాహన అవసరం. పర్యావరణ కాలుష్యానికి సంబంధించి.. కారణాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇందుకు మార్గాల గురించి తెలుసుకోవాలి. ఘన వ్యర్థాల రీసైక్లింగ్, రీ ప్రొడక్షన్ ప్రక్రియలపై అవగాహన తప్పనిసరి. పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. అంతర్జాతీయంగా పర్యావరణ కాలుష్యానికి దారితీస్తున్న ముఖ్యమైన దేశాలు/ ప్రాంతాలు; పర్యావరణ పరిరక్షణ దిశగా అంతర్జాతీయంగా అన్ని దేశాల సమూహాలు కలిసి నిర్వహిస్తున్న సదస్సులు - తీర్మానాలు - ఫలితాలపై విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. మరీ ముఖ్యంగా తాజాగా కుదిరిన పారిస్ ఒప్పందంపై సమగ్ర అధ్యయనం అవసరం.
నేను ఇంజనీరింగ్ విద్యార్థిని. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. సిలబస్‌లోని ఇండియన్ ఎకానమీకి ఎలా సన్నద్ధమవ్వాలి?
+
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జాతీయాదాయ భావనలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. పేదరికం-నిరుద్యోగితపై అభ్యర్థులు ప్రధానంగా దృష్టిసారించాలి. ఆర్థిక సంస్కరణలకు ముందు, తర్వాత పలు రంగాల్లో నమోదైన వృద్ధి గణాంకాలను పరిశీలించాలి. నీతి ఆయోగ్ ఏర్పాటు వెనుక ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఆర్థిక సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ, ప్రైైవేటీకరణ.. పర్యవసానాలను అధ్యయనం చేయాలి. 12 పంచవర్ష ప్రణాళిక ల లక్ష్యాలు, వ్యూహాలు, సాధించిన వృద్ధి గురించి తెలుసుకోవాలి. ప్రణాళికలకు కేటాయించిన నిధులు, విజయాలు, వైఫల్యాలు, కారణాలు, పర్యవసానాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక అధ్యయనం కొనసాగించాలి. ఇందుకోసం పేదరికం నిర్మూలనకు తీసుకున్న చర్యలు, చేపట్టిన పథకాలు, లక్షిత వర్గాలపై అవగాహన అవసరం.

అదే విధంగా నిరుద్యోగిత గురించి వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యక్ష నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నిర్వచనాలతో మొదలుపెట్టి నిరుద్యోగ రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, స్వయం ఉపాధి పథకాలపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగం కారణంగా వలసలు; అవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభివృద్ధిపై చూపుతున్న ప్రభావాలను తెలుసుకోవాలి. కోర్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపం, ఆర్‌బీఐ ఏర్పాటు ఉద్దేశం, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై పట్టు సాధించాలి. ఈ రంగంలో సంస్కరణలకు సంబంధించి నరసింహన్ కమిటీ సిఫారసులను ప్రధానంగా అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్, ద్రవ్యకోశ విధానాలకు సంబంధించి పలు అంశాల నిర్వచనాలు చదవాలి. సమకాలీన ఎకానమీ అంశాలపై దృష్టి సారించాలి. కొత్తగా ఏర్పాటైన బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతుల మంజూరు దిశగా తీసుకున్న చర్యల గురించి సమాచార సేకరణ ఉపకరిస్తుంది. ద్రవ్యోల్బణ సూచీలు, ఈ సూచీల్లో పేర్కొనే ఉత్పత్తులు/వస్తువులు/సేవల జాబితా తెలుసుకోవాలి. ఎకానమీలో మరో ముఖ్యమైన అంశం.. పబ్లిక్ ఫైనాన్స్. దీనికి సంబంధించి పన్ను విధానం, ప్రభుత్వ అప్పు; బడ్జెట్‌లో రూపాయి రాక-పోక తదితర అంశాలు తెలుసుకోవాలి. వీటితోపాటు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, రూపాయి మారకపు విలువ, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ మొదలైన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌లో మూడో భాగమైన ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం’ అనే అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలి?
+
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం అనే పేపర్‌ను చేర్చింది. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా, గ్రూప్-2లో నాలుగో పేపర్‌గా పేర్కొన్న ఈ పేపర్‌ను మూడు దశలుగా వర్గీకరించారు. తెలంగాణ ఉదమ్యం- రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్యమైన మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ (1990-2014) దశ. ఈ దశలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు/సంస్థల సమాచారం, వాటి నేపథ్యాలు తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజాచైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ - తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ- వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక తదితర అంశాలపై ముఖ్యంగా దృష్టిసారించాలి. తెలంగాణ రాష్ర్ట సమితి ఏర్పాటుకు కారణమైన వివిధ అంశాల గురించి తెలుసుకోవాలి. ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దారి తీసిన పరిస్థితులు, చిదంబరం ప్రకటన వరకు అన్నీ ముఖ్యమైనవే. ఇక్కడి ప్రధాన పార్టీల పాత్రపైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, సాహిత్యం, కళలు, ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర గురించి తెలుసుకోవాలి. పొలిటికల్ జేఏసీ, తెలంగాణలో శాఖల వారీగా ఏర్పాటైన జేఏసీలు వాటి కార్యకలాపాలు, నిరసన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మిలియన్ మార్చ్; సడక్ బంద్; సకల జనుల సమ్మె లాంటి ఉద్యమ కార్యక్రమాలు, వాటి పర్యవసానాల గురించి తెలుసుకోవాలి. శ్రీ కృష్ణ కమిటీ సిఫారసుల తర్వాతి క్రమంలో రాష్ర్ట ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలపై అవగాహన అవసరం. ఈ క్రమంలో 2013 జూలై 1న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన; ఆగస్టు 6 విభజన కమిటీ ఏర్పాటు; ఏకే ఆంటోనీ నేతృత్వంలో జీవోఎం ఏర్పాటు ముఖ్యమైనవి. వీటికి కొనసాగింపుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, తర్వాత లోక్‌సభ ఆమోదం; గెజిట్ విడుదల, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు ఇవ్వడం ఒక క్రమశ్రేణిలో చదవాలి. 2014లో ఎన్నికలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటన లాంటి అంశాలు కూడా ముఖ్యమే.
గ్రూప్స్ సిలబస్‌లోవర్తమాన అంశాలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి?
+
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన వ్యవహారాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు గమనించవచ్చు. ఉదాహరణకు.. ‘టీ-హబ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?’, ‘తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజున నిర్వహించారు?’ తదితర ప్రశ్నలు వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై సమగ్ర సమాచారం సేకరించుకోవాలి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ‘మిషన్ భగీరథ’ అని నామకరణం చేసింది. అదేవిధంగా మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి, హరితహారం, ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర సంక్షేమ పథకాలు, వాటి లబ్ధిదారులు మొదలైన అంశాలపై దృష్టి సారించి వాటికి సంబంధించిన పూర్తి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వీటి కోసం రోజూ పత్రికలను చదవడం అలవర్చుకోవాలి.

జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్, ప్రధాన మంత్రి సురక్ష్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తదితర పథకాలపై అవగాహన అవసరం. అలాగే ఆర్థిక వ్యవహారాలు, వార్తల్లోని వ్యక్తులు, అవార్డులు (డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం), క్రీడల గురించి చదవాలి. ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్ పాల్గొనే అంతర్జాతీయ సదస్సులపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు తాజాగా పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగిన కాప్ 21 సదస్సు, కామన్‌వెల్త్, జీ - 20 సదస్సు లాంటివి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా పరిణామాలపై కూడా దృష్టి సారించాలి. ఈ రంగంలో జరుగుతున్న ప్రయోగాలు, విజయాలు లాంటివి గమనిస్తూ ఉండాలి. వర్తమాన అంశాల కోసం రోజూ దినపత్రికలు చదువుతూ ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తద్వారా పరీక్ష సమయంలో సులువుగా పునశ్చరణ చేసుకునే అవకాశం ఉంటుంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లోని జనరల్ ఎస్సేలకు ఒకేసారి సన్నద్ధమవ్వడం ఎలా?
+
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)... గ్రూప్-1 లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థులు రెండు పేపర్లకు ఒకే సమయంలో ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అవి.. ప్రిలిమినరీ పరీక్షలో పేర్కొన్న జనరల్ స్టడీస్, మెయిన్ ఎగ్జామినేషన్‌లోని మొదటి పేపర్ జనరల్ ఎస్సే. ఈ రెండు పేపర్లకు తేడా... ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్‌లో పేర్కొన్న జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, తెలంగాణ ప్రాంత ప్రత్యేక అంశాలు; అలాగే మెయిన్ ఎగ్జామినేషన్‌లోని జనరల్ ఎస్సేలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రస్తావన లేకుండా మూడు విభాగాల్లో సిలబస్‌ను రూపొందించారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో, జనరల్ ఎస్సే డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు రెండింటికీ ఒకే సమయంలో సన్నద్ధం అయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉదాహరణకు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్ విభాగంలో పేర్కొన్న ‘సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత విజయాలు’ అనే అంశాన్ని.. జనరల్ ఎస్సేలోని మూడో విభాగంలోని సైన్స్ అండ్ టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా జనరల్ స్టడీస్‌లో ‘భారత చరిత్ర, సాంస్కృతిక- వారసత్వం’ అంశాలు జనరల్ ఎస్సేలోనూ యథాతథంగా ఉన్నాయి. ఇలా దాదాపు అన్ని అంశాలను ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్, మెయిన్స్ జనరల్ ఎస్సేతో అనుసంధానం చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు.
గ్రూప్-1 జనరల్ఎస్సే సెక్షన్-1లోని అంశాలకు ఎలా సన్నద్ధమవాలి?
+
గ్రూప్-1 మెయిన్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన జనరల్ ఎస్సేలో పేర్కొన్న అంశాలను ప్రత్యేక దృక్పథం, సునిశిత పరిశీలన ఆధారంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సామాజికంగా ప్రభావం చూపుతున్న అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. జనరల్ ఎస్సేలోని మొదటి విభాగంలోనే సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు అని స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఉద్దేశం అభ్యర్థులకు సామాజిక సమస్యలు, అంశాలపై ఉన్న అవగాహన స్థాయిని తెలుసుకోవడమే. ఇటీవల సామాజికంగా ప్రభావం చూపుతున్న అంశాలు/సంఘటనల నేపథ్యం, వాటి నివారణ దిశగా చేపడుతున్న చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఉదాహరణకు తాజాగా గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తున్న నిరసనలకు సంబంధించి.. రిజర్వేషన్ల నేపథ్యం, వాటి కోసం డిమాండ్లు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక ప్రగతి, న్యాయం అంశాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయా వర్గాలు, రంగాల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వాటి ఫలితాల గురించి అన్ని కోణాల్లో సమాచారం సేకరించి, అధ్యయనం చేయాలి. తద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
గ్రూప్-1 సిలబస్‌లోని గవర్నెన్స్ అనే టాపిక్‌కు ఏయే అంశాలు చదవాలి?
+
గ్రూప్-1 పేపర్- 3లోని మూడో సెక్షన్‌లో గవర్నెన్స్ అనే సబ్జెక్ట్‌పై అభ్యర్థులకు సమకాలీన అవగాహన అవసరం. దీనికోసం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న ఇ-గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్, సర్వీస్ కమిషన్, కాగ్ లాంటివి) వాటి పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్షన్ కమిషన్, కాగ్ లాంటివి శాసన వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా పనితీరు కనబరుస్తున్నాయి. వీటికి సంబంధించిన నేపథ్యం, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పాలనా పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారత, ఆహార భద్రత లాంటి పథకాలపైనా దృష్టి పెట్టాలి. ప్రభుత్వంతోపాటు సామాజిక అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న పౌర సమాజ వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు వాటి భాగస్వామ్యం, పనితీరు, ఫలితాలపై అవగాహన అవసరం. ఈ విభాగంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్), పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ అంశాలను పొందుపరిచారు. అంటే.. సామాజిక అభివృద్ధికి పారిశ్రామిక, వ్యాపార వర్గాల భాగస్వాములను చేస్తూ ప్రభుత్వాలు తీసుకున్న సీఎస్‌ఆర్, పీపీపీ విధానాలు-వాటి వల్ల కలిగే ఫలితాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఈ సబ్జెక్ట్‌లో అయిదో యూనిట్ చాలా కీలకమైంది. ఇందులో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం ఇది యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌లో ఒక పేపర్‌గా ఉంది. ఈ విభాగం ఉద్దేశం.. ఒక పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించే వ్యక్తికి ఉండాల్సిన అంకితభావం, విలువలు, నైతికత పరీక్షించడం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా సామాజిక స్పృహతో సమాధానాలు ఇవ్వొచ్చు.
‘భారత రాజ్యాంగం’ టాపిక్‌కు ఎలా సన్నద్ధమవ్వాలి?
+
గ్రూప్- 1, 2, 3 సిలబస్‌ల్లో భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు కామన్‌గా ఉన్నాయి. అభ్యర్థులు గ్రూప్ -1 సిలబస్‌కు ప్రిపేర్ అవ్వడం వల్ల మిగతా గ్రూప్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ - 1 సిలబస్‌ను ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేయాలి. గ్రూప్-1 పేపర్-3లో రెండో విభాగం పూర్తిగా పాలిటీకి సంబంధించింది. భారత రాజ్యాంగ రూపకల్పన కమిటీ సభ్యుల నుంచి రాజ్యాంగం ఆమోదం వరకు అన్ని అంశాలు తెలుసుకోవాలి. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు, రాజ్యాంగ లక్షణాలు, ప్రవేశిక (పీఠిక)లపై అవగాహన అవసరం. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణలకు కారణాలు - లక్ష్యాలు - ఫలితాలపై విశ్లేషణ అవసరం. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధుల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. వీటిని రాజ్యాంగంలో ఏ అధికరణల్లో పొందుపర్చారు? వీటి స్వరూపం? తదితర అంశాలు చదవాలి. ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్ అధికారాలు - విధులు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, కేబినెట్, వారి శాసన అధికారాలు, విధుల గురించి అవగాహన అవసరం. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. న్యాయ వ్యవస్థ. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కారణం... ఇటీవల శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పెరుగుతుందనే అభిప్రాయాలు, దానికి దారి తీస్తున్న పరిస్థితుల గురించి విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు - జవాబుదారీతనం లాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. కేంద్ర - రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్న నేపథ్యంలో అవి జాతీయ స్థాయిలో ప్రభావం చూపే పరిస్థితులు నెలకొంటున్నాయి. తద్వారా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - రాజ్యాంగంలో వీటికి ఉద్దేశించిన ఆర్టికల్స్, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయాలి. పాలిటీలో అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యాంశం 73, 74 రాజ్యాంగ సవరణలు. స్థానిక సుపరిపాలనకు దోహదపడే విధంగా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటుకు ఈ సవరణలు ఉద్దేశించినవి.

గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మీకు ఎదురైన సందేహాలను sakshieducation@gmail.com కు మెయిల్ చేయండి.
పోటీ పరీక్షల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఏయేఅంశాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు?
+
ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక పరిజ్ఞానం ఎలాంటి పోటీ పరీక్షలకైనా అవసరమే. అన్ని రకాల పోటీ పరీక్షలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలికాంశాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగమైన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి 1, 2 ప్రశ్నలు కచ్చితంగా వస్తాయి.

బ్యాంకింగ్ సంబంధిత పారిభాషిక పదాలు, ఆర్‌బీఐ విధులు, వాణిజ్య బ్యాంకులు- చరిత్ర, విధులు, బ్యాంకులు వినియోగదారులకు అందజేస్తున్న సేవలు, బ్యాంకింగ్ సంస్కరణలను అధ్యయనం చేసిన కమిటీలు, కేంద్ర ప్రభుత్వం- బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య సంబంధం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రంగాల అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుందో అధ్యయనం చేయాలి. ప్రామాణిక వార్తా పత్రికలు, మేగజీన్లను చదువుతూ బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడూ వివరాలు సేకరించాలి. వీటితో పాటు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పరిశీలించడం ప్రయోజనకరం. వీటి ఆధారంగా జనరల్ నాలెడ్‌‌జ, కరెంట్ అఫైర్‌‌స విభాగాల్లో వచ్చే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించవచ్చు.
గ్రూప్స్ సిలబస్‌లోని ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ అంశం కోసం ఎలా సన్నద్ధమవ్వాలి?
+
టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 మెయిన్స్‌లో జనరల్ ఎస్సేలో, అయిదో పేపర్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ కామన్‌గా ఉంది. దీంతో పాటు గ్రూప్-1, 2, 3 లలోని జనరల్ స్టడీస్‌లోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ) విభాగం ఉంది. కాబట్టి ఈ సబ్జెక్ట్‌కు సరైన ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన పరిణామాలపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సామాజిక అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం; దీని ద్వారా దేశ అభివృద్ధికి ఈ రంగం చేస్తున్న కృషి, ఆవిష్కరణలపై అవగాహనను పరిశీలించే దిశగా సిలబస్ రూపొందించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రాచుర్యం పొందుతున్న అంశాలు, దేశంలో ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు తాజా ఉపగ్రహ ప్రయోగాలు - వాటి ద్వారా కలిగే ఫలితాలు - అవి సామాజిక అభివృద్ధికి దోహద పడే తీరు లాంటివి. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పారిశ్రామిక అభివృద్ధి అంశాలను చదవాలి.

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న చర్యలు, విధానాల్లో అవలంబిస్తున్న మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇటీవల విద్య, వైద్య, సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానంపై సంపూర్ణ అవగాహన అవసరం. వీటితోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రాథమిక నైపుణ్యాలు అందించే కంప్యూటర్ వినియోగం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా రోబోటిక్స్, నానో టెక్నాలజీ కూడా ఇటీవల ఎస్ అండ్ టీ విభాగంలో ప్రాశస్త్యం పొందుతున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి.

అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. భారత అంతరిక్ష విధానం. ఈ దిశగా భారత్‌చేపడుతున్న నూతన ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త కార్యక్రమాలు (చంద్రయాన్, ఎడ్యూశాట్ లాంటివి) గురించి అవగాహన అవసరం. అంతరిక్ష సాంకేతికత ఆధారంగా సామాజిక అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు.. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, వరదలు, తుపానులు, సునామీలు, వాతావరణ మార్పులకు సంబంధింన వాటి గురించి తెలుసుకోవాలి.

శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగంగా అభ్యర్థులు దృష్టి సారించాల్సిన మరో ప్రధానాంశం.. శక్తి వనరులు. జల, అణు, న్యూక్లియర్ శక్తి వనరులు - వాటి వినియోగం దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, స్థాపిస్తున్న సంస్థల గురించి అవగాహన పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరులుగా గుర్తింపు పొందుతున్న బయోమా్‌స్; వ్యర్థాల ఆధారిత ఇందన వనరుల ఉత్పత్తి, సౌర, పవన విద్యుత్ ఉత్పాదకాలు, వాటి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు; అనువైన ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకోవాలి. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటి గురించి తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వివిధ వ్యాధులు - టీకాలు, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌లు వాటి కారకాలు, స్వభావాలు - ప్రభావాల గురించి తెలుసుకోవాలి. హెచ్‌ఐవీ, స్వైన్‌ఫ్లూ, చికెన్‌గున్యా తదితర వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు, వాటి నివారణలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహన అవసరం. ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఆహారభద్రత, ఆ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధలు, వాటి అమలు తీరు. డీ-ఫ్లోరైడేషన్ తదితర అంశాలపై సమాచారం సేకరించాలి. ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న బయోటెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్ బయో టెక్నాలజీ, ప్లాంట్ బయో టెక్నాలజీ, ఫార్మ్ బయో టెక్నాలజీలలోని ముఖ్యాంశాలు - వాటి పూర్వాపరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి బయో టెక్నాలజీ పోషిస్తున్న పాత్రపై అధ్యయనం చేయాలి. ఉదాహరణకు.. బీటీ విత్తనాలు, వాటి ఫలితాలు. అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అధిక మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ ఓరియంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా తాజా సమాచారం ఆధారంగా వివరాలు సేకరిస్తూ సన్నద్ధమవ్వాలి.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ‘పర్యావరణం’ సంబంధిత అంశాలను ఎలా చదవాలి?
+
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్స్ సిలబస్‌లో ‘పర్యావరణం’ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చారు. భూమిపై ఉన్న ఘన, వాయు, ద్రవ సమ్మేళనాన్ని పర్యావరణంగా చెప్పొచ్చు. కాబట్టి ముందుగా పర్యావరణంలోని వివిధ విభాగాలైన వాతావరణం (అట్మాస్ఫియర్), శిలావరణం (లిథోస్ఫియర్), జీవావరణం (బయోస్ఫియర్) గురించి పూర్తి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. జీవావరణ శాస్త్రం- భావనలు, జాతి, జనాభా, జీవ సమాజం, జీవ మండలం, జీవ గోళం, జీవావరణ వ్యవస్థ, జీవావరణ అనుక్రమం, ఆహార శృంఖలం, ఆహార వల, జీవావరణ పిరమిడ్ వంటి మూల జీవావరణ శాస్త్ర అంశాలను సమగ్రంగా చదవాలి.
  • జీవావరణ శాస్త్రానికి సంబంధించి జీవవైవిధ్యం ప్రస్తుతం అధిక ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ), భూమిపై ఉన్న విభిన్న జాతులు, ఆవరణ వ్యవస్థల వైవిధ్యాల గురించి బాగా చదవాలి.
  • దేశంలోని జాతీయ పార్కులు, అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వులు, టైగర్ రిజర్వులు, కమ్యూనిటీ, బయోస్ఫియర్ రిజర్వులు, ఎలిఫెంట్ రిజర్వుల గురించి తెలుసుకోవాలి.
  • పర్యావరణంలో మరో ముఖ్య అంశం పర్యావరణ కాలుష్యం. గాలి, జల, భౌమ, శబ్ద, కాంతి కాలుష్యాలు, కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, నివారణ పద్ధతులను చదవాలి.
  • కాలుష్యానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, కాలుష్య సంఘటనల గురించి తెలుసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, తీవ్రమవుతున్న తుపాన్లకు ప్రధాన కారణం శీతోష్ణస్థితి మార్పు. కాబట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల గురించి తెలుసుకోవాలి. దేశంలో పర్యావరణ చట్టాలు, శాసనాలు, వాటి అమలు, వివిధ విభాగాల్లోని అత్యున్నత అధికారుల గురించి తెలుసుకోవాలి.
మెంటల్ ఎబిలిటీస్ సబ్జెక్టుకు ఎలా సన్నద్ధమవ్వాలి?
+
అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం చేసే మానసిక సామర్థ్యాన్ని పరిశీలించడానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మెంటల్ ఎబిలిటీస్ లేదా జనరల్ ఎబిలిటీస్‌ను పోటీ పరీక్షల్లో చేర్చింది. గ్రూప్- 1, 2, 3, 4 పరీక్షల్లో, అదేవిధంగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల్లో ఈ సబ్జెక్ట్ నుంచి క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రూప్-1 సిలబస్‌ను పరిశీలిస్తే వీటిలో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. స్టేట్‌మెంట్ (ప్రకటన), రెండు అసెంప్షన్‌‌స (భావించిన అంశాలు); ఒక ప్రకటన (స్టేట్‌మెంట్), రెండు నిర్ణయాలు (కన్‌క్లూజన్‌‌స); ఒక ప్రకటన (స్టేట్‌మెంట్), రెండు తీసుకోవాల్సిన చర్యలు (కోర్‌‌స ఆఫ్ యాక్షన్); బలమైన వాదం (స్ట్రాంగ్ ఆర్గ్యూమెంట్), బలహీన వాదం (వీక్ ఆర్గ్యూమెంట్) మొదలైన అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితో పాటు రెండు సంఘటనలు ఇచ్చి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఒక సంఘటన కారణం (కాజ్) అయితే, మరో సంఘటన దాని ప్రభావం (ఎఫెక్ట్) కావచ్చు. అందులో కారణం, ప్రభావాలను నిర్ణయించాల్సి ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీస్‌కు సంబంధించి సీటింగ్ అరెంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్‌‌స, డెరైక్షన్ సెన్‌‌స టెస్ట్, నంబర్ సిరీస్, కోడింగ్ - డీకోడింగ్, ఈక్వాలిటీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ, వర్‌‌డ/ అల్ఫాబెట్ ఆధారిత ప్రశ్నలు, ర్యాంకింగ్ మొదలైన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి టేబుల్స్, పై చార్‌‌ట, గ్రాఫ్ (లైన్ లేదా బార్), ఒక పేరాగ్రాఫ్ లేదా రాడార్ గ్రాఫ్ ఇస్తారు. ఈ రకమైన ప్రశ్నల్లో డేటాను క్షుణ్నంగా చదివి ఇచ్చిన డేటాను విశ్లేషించి పాయింట్స్ నోట్ చేసుకుంటే మంచి స్కోరు చేయవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి నంబర్ సీక్వెన్‌‌స, సిరీస్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభ నష్టాలు మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు కాలం-పని, కాలం- వేగం-దూరం, సరళ వడ్డీలపై ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఎబిలిటీలో భాగంగా బేసిక్ ఇంగ్లిష్ మీద కూడా ప్రశ్నలు వస్తాయి. దీని కోసం హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదవాలి. మ్యాథ్స్ విభాగానికి సంబంధించి ఆర్.ఎస్. అగర్వాల్ రీజనింగ్, అర్థమెటిక్ బుక్స్ ఉపయుక్తంగా ఉంటాయి. పైన పేర్కొన్న అంశాలపై పట్టు సాధిస్తే వివిధ పోటీ పరీక్షల్లో ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు.
గ్రూప్-1, పేపర్-2లో ‘భారత దేశ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర’ అనే విభాగానికి సంబంధించి ఏయే అంశాలు చదవాలి?
+
ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆధునిక యుగానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు. మొత్తం అయిదు యూనిట్లుగా ఉన్న ఈ సెక్షన్‌లో మొదటి రెండు సెక్షన్లు ప్రాచీన భారత చరిత్రకు సంబంధించినవి కాగా, మిగిలిన మూడు యూనిట్లు ఆధునిక చరిత్ర అంశాలుగా పేర్కొనవచ్చు. మొదటి రెండు యూనిట్లకు సంబంధించి సింధూ నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మొదలైన మత ఉద్యమాల ప్రారంభం, సమాజంపై వాటి ప్రభావం గురించి చదవాలి. ఆరో శతాబ్దంలో మతోద్యమాలు రావడానికి కారణాలు; మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, వాస్తు శిల్పకళల గురించి అధ్యయనం చేయాలి. గాంధార శిల్పకళపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇస్లాం మత ఆవిర్భావం, సిద్ధాంతాలు, భారతీయ సమాజంపై వాటి ప్రభావం అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. భక్తి, సూఫీ ఉద్యమాల ప్రాముఖ్యం, సమాజంపై వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా కాకతీయ, విజయనగర రాజుల కాలంలో మత, ఆర్థిక, సాంస్కృతిక, వాస్తు శిల్పకళలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. నాటి సమాజంలో తెలుగు భాషా సాహిత్యాలు, అష్టదిగ్గజాలు, వారి రచనలు, దేవాలయాలు, చిత్రలేఖనం, సంగీత, నృత్య కళలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి. ఢిల్లీ సుల్తాన్లు, మొగలుల పరిపాలన, వాస్తు శిల్ప కళలు, సాహిత్య అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి.

ఆధునిక భారత దేశ చరిత్ర నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ మూడో యూనిట్ (భారత్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభం) నుంచి ప్రత్యేక శ్రద్ధతో సన్నద్ధత సాగించాలి. బ్రిటిష్ పాలనకు దారితీసిన ప్లాసీ యుద్ధంతో ప్రారంభించి బ్రిటిష్ కాలంలోని ముఖ్య ఘట్టాలు, వారి నిబంధనలు, బ్రిటిషర్లకు-ఇతర రాజ వంశాలకు మధ్య జరిగిన యుద్ధాలపై దృష్టి సారించాలి. బ్రిటిషర్ల హయాంలో చేసిన అభివృద్ధి పనులు (రైల్వేలు, ట్రాన్స్‌పోర్ట్, టెలిగ్రాఫ్ మొదలైనవి) గురించి కూడా తెలుసుకోవాలి.

ఆధునిక భారత దేశ చరిత్రలో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు, ముఖ్యంగా గిరిజనులు, రైతుల ఉద్యమాలు, నిరసనలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటం, అందుకు దారితీసిన పరిస్థితులు, భారతీయ వాదం పెరిగేందుకు కారణమైన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. వీటితోపాటు సామాజిక-మత ఉద్యమాలు, కుల వ్యతిరేక ఉద్యమాలు గురించి అవగాహన ఎంతో అవసరం. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, అలీగఢ్ ఉద్యమం మొదలైన వాటిపై దృష్టి సారించాలి. ఈ కాలంలో చారిత్రకంగా గుర్తింపు పొందిన వ్యక్తులు, వారు చేపట్టిన చర్యల గురించి చదవాలి. ఉదాహరణకు మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగి రావడం, ఆ తర్వాత కాలంలో ఆయన నేతృత్వంలో సాగిన పలు ఉద్యమాలు చదవాలి. ఈ కాలంలోని భక్తి ఉద్యమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. 1885 నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చే వరకు మూడు దశలుగా జరిగిన స్వాతంత్య్రోద్యమ దశలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ క్రమంలో అఖిల భారత కిసాన్ సభ, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ ఉద్యమాల వ్యాప్తి, వాటికి దారితీసిన పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి.

తెలుగు అకాడమీ ‘చరిత్ర’ పాత పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు (తెలుగులోకి అనువాదం); డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు కూడా సన్నద్ధతకు దోహదపడతాయి. ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే జనరల్ ఎస్సేలోని భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అనే అంశానికి కూడా సన్నద్ధత లభిస్తుంది.
గ్రూప్స్‌లో తెలంగాణభౌగోళిక శాస్త్రానికి సంబంధించి ఏ విధంగా సన్నద్ధమవ్వాలి?
+
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న పోటీ పరీక్షల్లో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నైసర్గిక స్వరూపం, వాతావరణం, నదీ వ్యవస్థలు, వాటిపై ఉన్న ప్రాజెక్టులు, అడవుల విస్తరణం, రవాణా వ్యవస్థ, నేలలు, పరిశ్రమలు, ఖనిజాలు, వివిధ శక్తి వనరులు గురించి సమగ్రంగా అభ్యసించాలి. ముఖ్యంగా ప్రతి పరీక్షలో తెలంగాణ పర్యాటక స్థలాలపై ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక స్థలాలు, వాటి ప్రాముఖ్యం గురించి తెలుసుకోవాలి. నదీ వ్యవస్థలకు సంబంధించి అవి రాష్ట్రంలో భౌగోళికంగా ఎక్కడ ప్రవేశిస్తున్నాయో తెలుసుకోవడంతో పాటు వాటి ఉపనదులు, రిజర్వాయర్ల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ జనాభాకు సంబంధించి జన సాంద్రత, అక్షరాస్యత శాతాలు, లింగ నిష్పత్తి, గిరిజన జనాభా మొదలైన గణాంకాలను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ, తద్వారా సాగునీరు వనరుల పెంపు దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు సంబంధించి భౌగోళిక అంశాల మీద కూడా ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటలు- సంబంధిత ప్రాంతాలు, వన్య మృగాల సంరక్షణ కేంద్రాల (ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం) గురించి చదవాలి. భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ఇంటర్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి.
గ్రూప్-2లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ అంశాలను చదవాలి?
+
ఏ పోటీ పరీక్షకైనా ఎకానమీ సబ్జెక్ట్ చాలా కీలకం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కూడా ఎకానమీకి అధిక ప్రాధాన్యం కల్పించింది. గ్రూప్-2 సిలబస్‌లో ఎకానమీకి సంబంధించి ‘ఆర్థికం, అభివృద్ధి’ అనే అంశాన్ని చేర్చింది. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ: వివాదాలు, సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; అభివృద్ధి మార్పుల అంశాలు అనే విభాగాలున్నాయి. అయితే ఇందులో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి.. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ భావనలను, వాటి మధ్య ఉన్న సంబంధాల గురించి చదవాలి. ఆర్థికవృద్ధి ప్రమాణాలు, జాతీయాదాయం నిర్వచనం, దాన్ని కొలిచే ప్రమాణాలు, నామినల్ అండ్ రియల్ ఆదాయం లాంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. పేదరికం, నిరుద్యోగం, వాటి భావనలు, రకాలు, కొలిచే విధానాలు; ఆదాయ ఆధారిత పేదిరకం, ఆదాయేతర ఆధారిత పేదరికం తదితర అంశాలపై పట్టు సాధిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానం రాయవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రణాళిక సంఘం స్థానంలో ప్రవేశ పెట్టిన నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్స్, ప్రాధాన్యతలు, వ్యూహాలు లాంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటూ సమకాలీనంగా వాటికి సంబంధించి జరిగే ఈవెంట్స్‌తో అనుసంధానిస్తూ చదవాలి. నీతి ఆయోగ్- సమ్మిళిత వృద్ధి; నీతి ఆయోగ్ అమల్లోకి రాకముందు ఉన్న ప్రణాళిక సంఘం సాధించిన విజయాల గురించి కూడా చదవడం ఉపయుక్తం. వీటితో పాటు బిజినెస్‌కు సంబంధించి ప్రామాణిక దిన పత్రికలను చదవాలి. ఆర్థిక అంశాల గురించి నిపుణులు రాసే వ్యాసాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్ట్‌కు సంబంధించి సందేహాలు వస్తే స్నేహితులను అడిగి తెలుసుకోవడం, ఇంటర్‌నెట్ లేదా సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
టీఎస్‌పీఎస్సీలోని మెంటల్ ఎబిలిటీకి నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు ఎలా సన్నద్ధమవ్వాలి?
+
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే ఏ పోటీ పరీక్షలో అయినా మెంటల్ ఎబిలిటీస్‌లో భాగంగా గణితానికి సంబంధించిన అంశాలు విధిగా ఉంటాయి. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష, మెయిన్స్‌ల్లో; గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లలో గణితానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉంది. దాంతో పాటు ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో కూడా మెంటల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో ప్రకటన- భావించిన అంశాలు; ప్రకటన- నిర్ణయాలు; ప్రకటన- తీసుకోవాల్సిన చర్యలు; ప్రశ్న- రెండు వాదాలు; వీటితో పాటు సీటింగ్ అరెంజ్‌మెంట్; బ్లడ్ రిలేషన్స్; దిశలు మీద ప్రశ్నలు; నంబర్ సిరీస్; కోడింగ్ డీకోడింగ్; ర్యాంకింగ్; ఈక్వాలిటీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ; లాభ నష్టాలు, నిష్పత్తులు, సగటు, కాలం-పని, కాలం- వేగం- దూరం, సరళ వడ్డీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో భాగంగా ఒక టేబుల్, పై చార్ట్, గ్రాఫ్ (లైన్ లేదా బార్) తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఒక అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉండాల్సిన మానసిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి మెంటల్ ఎబిలిటీని సిలబస్‌లో చేర్చారు. కాబట్టి వీటిని అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా సులువుగానే సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్ అంశాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా అర్థమెటిక్ అంశాలను సులువుగా సమాధానం ఇవ్వొచ్చు. నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులకు సంఖ్యలపై భయం ఉండడం వల్ల ఈ విభాగాన్ని కఠినమైన అంశంగా పరిగణిస్తారు. కానీ వీటిని శ్రద్ధగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ప్రశ్నలకు చాలా తక్కువ సమయంలో సమాధానం గుర్తించవచ్చు. తద్వారా తక్కువ శ్రమతో సమయం వృథా కాకుండా, కచ్చితమైన మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ముందుగా అభ్యర్థులు మ్యాథ్స్, నాన్‌మ్యాథ్స్ అనే ఆలోచనా ధోరణిని వీడి, ఆయా అంశాలపై మక్కువ పెంచుకొని సాధన చేయడం ద్వారా విజయ తీరాలకు చేరుతారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించి తెలంగాణ జాగ్రఫీ ప్రాధాన్యం తెలపండి.
+
పోటీ పరీక్షల్లో భూగోళశాస్త్రం ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవలనిర్వహించిన వివిధ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే తెలంగాణా నేపథ్యానికి చెందిన అంశాలపై ప్రశ్నలు అధికంగా వస్తున్నట్లు గమనించవచ్చు. మార్కుల సాధనలో తెలంగాణా జాగ్రఫీ అంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తెలంగాణా ఉనికి, నైసర్గిక స్వరూపం, రాష్ట్రంలో ప్రవహించే నదులు, ముఖ్యమైన చెరువులు,ప్రాజెక్టులు, శీతోష్ణస్థితి, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదవాలి.
పోటీ పరీక్షల్లో `విద్యుత్`నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ప్రశ్నల స్వరూపం ఎలా ఉంటుంది?
+
భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికాబద్ధంగా చదవాలి. టీఎస్‌పీఎస్సీ పరీక్షల సిలబస్‌లోని జనరల్ స్టడీస్ విభాగంలో జనరల్ సైన్స్ కూడా భాగమే. ఈ అధ్యాయం నుంచి ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, నిరోధ నియమాలు, విద్యుదయస్కాంత ఫలితాలు, వాటి అనువర్తనాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ లాంటివాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్; పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్. మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్ / కూలుంబ్.

మాదిరి ప్రశ్నలు
గ్రూప్ - 2, పేపర్-1లోనిజనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ విజయాలు అనే అంశాన్ని ఎలా చదవాలి?
+
గ్రూప్-1, గ్రూప్2తో పాటు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరిక్షల్లోనూ పేపర్-1 జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ విజయాలు ఒక అంశం. పేపర్-1 జనరల్ స్టడీస్‌లో 11 అంశాలు ఉన్నాయి. మొత్తం మార్కులు 150. ప్రతి అంశం నుంచి సుమారు 13 నుంచి 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మిగతా అంశాలతో పోల్చినప్పుడు జనరల్ సైన్‌‌స సిలబస్ పరిధి ఎక్కువ.

జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం 7 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి. ఈ శాస్త్రాల పరిజ్ఞానం మానవాళి సంక్షేమానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి. వాటి అనువర్తనాలకు సంబంధించిన ప్రశ్నలను ఏవిధంగా అడుగుతున్నారో పరిశీలించాలి. ఉదాహరణకు మానవుని జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం? కిటకాల్లో రక్తం రంగు? శీతాకాలంలో మొక్కల పత్రాలు ఎందుకు రాలిపోతాయి? అథ్లెట్ ఫూట్ వ్యాధికి కారణం? గాయాలు మానడానికి కారణమైన విటమిన్? ఇలాంటి ప్రశ్నలను పరిశీలిస్తే మానవ, వృక్ష శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు-నివారణ, విటమిన్లు, ఆర్థిక వృక్ష శాస్త్రం, జెనిటిక్స్ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నట్లు తెలుస్తోంది.

జనరల్ సైన్స్ విభాగంలో జీవశాస్త్రంతో పోల్చితే భౌతిక-రసాయన శాస్త్రం నుంచి తక్కువ మార్కులు వస్తాయి.
భౌతిక శాస్త్రంలో కాంతి, ధ్వని, విద్యుత్, అయస్కాంతత్వం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదా:
  1. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు?
  2. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం?
  3. విద్యుత్ బల్బ్‌లోని ఫిలమెంట్?
  4. ఆటంబాంబుకు ఆధారమైన సూత్రం?
  5. ఏ సూత్రం ఆధారంగా రాకెట్ నింగిలోకి ఎగురుతుంది?
రసాయన శాస్త్రం నుంచి నిత్యజీవితంలో ఉపయోగపడే అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు..
  1. అగ్గిపుల్లలో మండే రసాయన పదార్థం?
  2. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు?
  3. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం?
  4. మస్కిటోకాయిల్స్‌లోని రసాయనం?
  5. ఉల్లిలో ఘాటైన వాసనకు కారణం?

అలాగే పరమాణు నిర్మాణం, మూలకాల ఆవర్తన పట్టిక, రసాయన బంధం, ద్రావణాలు, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వాయువులు తదితర అంశాలకు సంబంధించిన అనువర్తనాలపై దృష్టి సారించాలి.

జనరల్ సైన్‌‌సతో పోల్చితే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ‘భారత్ సాధించిన విజయాలు’ అంశం పరిధి కాస్త తక్కువే. కానీ ఈ అంశం నుంచి సుమారు 3 నుంచి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంతరిక్ష రంగం, పరిశోధన సంస్థలు, ఇస్రో విజయాల పరంపర, చంద్రయాన్, రక్షణ రంగం, అగ్ని మిస్సైల్ క్షిపణి ప్రస్థానం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అంటువ్యాధుల నివారణ, మిషన్ ఇంద్రధనస్సు, సంప్రదాయేతర ఇంధన వనరులు, జీవ ఎరువులు, పర్యావరణం- కాలుష్యం, జన్యు పరివర్తిత మొక్కల సృష్టి-లాభనష్టాలు, బయోటెక్నాలజీ, స్టెమ్‌సెల్ ప్రయోగాలపై అభ్యర్థులు పట్టు సాధించాలి. ఇటీవల ప్రకటించిన 2015 నోబుల్ ఫ్రైజ్ విజేతలు, ఆవిష్కరణలు, వారి దేశం తదితర విషయాలను అధ్యయనం చేయాలి. సైన్‌‌స అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ తేది నుంచి ఏడాది లోపు సంఘటనలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించే మొదటి గ్రూప్-2 పరీక్ష కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన ఊరు-మన చెరువు, వాటర్ గ్రిడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని పథకాలపై అవగాహన అవసరం. అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చదివి, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
గ్రూప్-1, పేపర్ 2లోని భారతదేశ, తెలంగాణ జాగ్రఫీతోపాటు జనరల్ స్టడీస్‌లో జాగ్రఫీ అంశాలను ఎలా చదవాలి?
+
గ్రూప్-1, పేపర్-2లో భారతదేశ, తెలంగాణా భౌగోళిక వ్యవస్థను ఒక విభాగంగా పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ జనరల్ స్టడీస్‌లోనూ తెలంగాణ జాగ్రఫీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్-1 మెయిన్‌‌సకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జనరల్ స్టడీస్‌ను దృష్టిలో ఉంచుకుని చదవాలి. కాబట్టి భారత భౌగోళిక స్వరూపం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకూ.. భౌగోళిక ప్రాధాన్యమున్న అన్ని అంశాలు చదవాలి.

భారత భౌగోళిక అంశాలకు సంబంధించి ముఖ్యమైన నదులు, సరస్సులు, వాటి పరీవాహక ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలపై దృష్టి పెట్టాలి. భౌగోళిక సంబంధమున్న అంశాలను కూడా సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి.

తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఈ ప్రాంతంలోని ముఖ్యమైన సెజ్‌లు, ఎకనామిక్ జోన్‌లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, తాజా వ్యవసాయ పరిస్థితులు, పర్యావరణ సమస్యలు, రవాణా వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని జనాభా స్థితిగతులు, వారు నివసిస్తున్న ప్రాంతాలు గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీ కోణంలోనే పారిశ్రామికీకరణ కూడా చదవాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2పరీక్షలో సొసైటీ సబ్జెక్టును ఎలా చదవాలి?
+
ప్రభుత్వ అధికారిగా నియమితులయ్యే వారికి చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందులో భాగంగానే గ్రూప్-2, పేపర్-2లో సొసైటీ విభాగాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీనిలో భారత సాంఘిక నిర్మాణం, సామాజిక సమస్యలు, సాంఘిక ఉద్యమాలు, తెలంగాణ సాంఘిక సమస్యలు, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై పరీక్షల్లో ప్రశ్నలు ఇస్తారు. ప్రధానంగా కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, మహిళలు; తెలంగాణ సమాజంలో సామాజిక, సాంస్కృతిక లక్షణాలు, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, మహిళలపై హింస, బాల కార్మికులు, మనుషుల అక్రమ రవాణా తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు, వాటి నేపథ్యాల గురించి తెలుసుకోవాలి. తెలంగాణ సాంఘిక సమస్యలైన వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, బాల కార్మికులు, బాలికల సమస్యలు, ఫ్లోరోసిస్, వలసలు, రైతులు-చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులకు సంబంధించి నిశ్చయాత్మక విధానాలు- సంక్షేమ కార్యక్రమాలు; ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళలు, చిన్నారులు, గిరిజనులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం అవసరం. గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న అంశాల వారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్ ఎక్కువగా ఉందనిపించినా, సిలబస్‌కు సంబంధించి సూక్ష్మ అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి పరీక్షలకు సిద్ధమవడం తేలికవుతుంది.
గ్రూప్-2, పేపర్-3 సంబంధించిన ‘అభివృద్ధి, మార్పు’ అంశాలను ఎలా చదవాలి?
+
గ్రూప్-2, పేపర్-3లోని అభివృద్ధి, మార్పు అంశాలపై సిలబస్‌లో పేర్కొన్న భారత్‌లో ప్రాంతీయ, సామాజిక అసమానతలు, కులం, స్వజాతీయత (తెగ), లింగ, మతం; వలస; పట్టణీకరణ అంశాలపై దృష్టి సారించాలి. భూసేకరణ విధానం, ఆర్థిక సంస్కరణలు, సుస్థిర అభివృద్ధిలోని వివిధ భావనలను చదవాలి.
గ్రూప్స్ సిలబస్‌లోని ‘తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం’ కోసం ఎలా ప్రిపేర్ కావాలి?
+
గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరో పేపర్, గ్రూప్-2లో నాలుగో పేపర్ ‘తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం’ను మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.. ఐడియా ఆఫ్ తెలంగాణ(1948-70); సమీకరణ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014). ఆయా విభాగాలకు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలవారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి. గ్రూప్-1, గ్రూప్-2 రెండు పరీక్షలకూ సన్నద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ కోణంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ ముఖ్యాంశాలతో బిట్స్/షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే గ్రూప్-2కు కూడా ఉపకరిస్తుంది. ఐడియా ఆఫ్ తెలంగాణ విభాగానికి సంబంధించి అభ్యర్థులు 1948లో హైదరాబాద్‌పై పోలీస్ చర్య నుంచి ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు. ఈ క్రమంలో జరిగిన ముఖ్య పరిణామాలు తెలుసుకోవాలి. ముల్కీ ఆందోళన, స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్, సిటీ కాలేజీ ఘటన, దాని ప్రాముఖ్యత, తెలంగాణ రాష్ట్ర డిమాండ్, చర్చ, ఫజల్ అలీ కమిషన్, సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం తదితర అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.

సమీకరణ దశ కోసం అభ్యర్థులు కొంత ఎక్కువ కసరత్తు చేయాలి. కారణం ఈ దశలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, పరిణామాలు జరిగాయి. జై ఆంధ్ర ఉద్యమం; 1973లో రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం; తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు; రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి చదవాలి. ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత; తెలంగాణ ఆత్మాభిమానం, భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 1990 దశకంలో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి ప్రభావం; పెరిగిన ప్రాంతీయ అసమానతలు; తెలంగాణలో వ్యవసాయం, చేతివృత్తుల రంగాల్లో సంక్షోభం, తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంశం కోసం గ్రూప్స్ అభ్యర్థులు 1991-2014 మధ్యకాలంలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు/సంస్థల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజాచైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక లాంటి అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. తర్వాతి పరిణామాలతోపాటు పత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ సిఫారసుల తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన అన్ని పరిణామాలపై అవగాహన ఎంతో ముఖ్యం.