Skip to main content

PM Modi: న్యూజిలాండ్ ప్ర‌ధానితో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ బేటీ

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్(Chris Hipkins) తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న‌ వాణిజ్యం, విద్య, క్రీడలు, ప‌ర్యాట‌కం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని ఇచ్చుపుచ్చుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.
PM Modi, New Zealand PM Hipkins
PM Modi, New Zealand PM Hipkins

పపువా న్యూ గినియా(Papua New Guinea)లో నిర్వ‌హించిన‌ ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. అక్క‌డి నుంచి న్యూజిలాండ్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. 

ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య‌ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు క‌లిసి సంయుక్తంగా ముందుకుసాగాల‌ని ఈ సంద‌ర్భంగా ఇరుదేశాధినేత‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.

☛➤☛ వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

modi

జనవరిలో హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు ప్రధానుల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే.

న్యూజిలాండ్ ప్రధానితో అద్భుతమైన సమావేశం జరిగిందని, భారత్-న్యూజిలాండ్ సంబంధాలపై పూర్తి స్థాయిలో చర్చించానని న్యూజిలాండ్ ప్ర‌ధానితో బేటీ ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై చర్చించామ‌ని వివ‌రించారు.

☛➤☛  Download Current Affairs PDFs Here

Published date : 22 May 2023 06:32PM

Photo Stories