అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ –2023లో నిర్వహించిన ఎంటెక్ రెండో సెమిస్టర్ , ఎంసీఏ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ అక్టోబర్ 13న విడుదల చేశారు.
ఎంటెక్, ఎంసీఏ ఫలితాల విడుదల
ఫలితాలు తెలుసుకోవడానికి జేఎన్టీయూ అనంతపురం కళాశాల అకడమిక్ సెక్షన్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఈ. అరుణకాంతి, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి. విష్ణువర్ధన్, డి. లలిత కుమారి, పాలక మండలి సభ్యుడు ఎం. రామశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.