44 Students Debarred: డిగ్రీ పరీక్షల్లో 44 మంది డీబార్
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఆగస్టు 25న నిర్వహించిన దూరవిద్య డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షల్లో రెండు పరీక్ష కేంద్రాల్లో 44 మందిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎ.నరేందర్ తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో 44 మంది డీబార్
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 మంది విద్యార్థులు, నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నలుగురు మొత్తం 44 మంది కాపీయింగ్ చేస్తుండగా.. పట్టుకుని డీబార్ చేసినట్లు తెలిపారు. 3,815 మంది విద్యార్థులు హాజరుకావా ల్సి ఉండగా 961మంది గైర్హాజరైనట్లు తెలిపారు.