Skip to main content

Degree Admissions: డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం

Another option for degree admissions

నారాయణఖేడ్‌: డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు గాను మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందని స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంజినీరింగ్‌, నీట్‌, వ్యవసాయ కోర్సుల్లో సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం ఈనెల 28 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 5న వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చని తెలిపారు. 9న సీట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


చదవండి: Job Opportunities: సేఫ్టీ కోర్సుతో విస్తృత ఉపాధి అవకాశాలు

Published date : 21 Aug 2023 05:27PM

Photo Stories