సాక్షి, అమరావతి: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కేజీబీవీల్లో 1,358 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు.
KGBV అన్ని పోస్టులకు ఒకే దరఖాస్తు
ఒక అభ్యర్థి ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు చేయాలనుకుంటే అన్ని పోస్టులకు ఒకసారి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి, పోస్టుకు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటికే ఎవరైనా అభ్యర్థులు ఒక పోస్టుకు దరఖాస్తు చేసి, మరలా మరో పోస్టుకు రెండో దరఖాస్తు సమర్పించాలనుకుంటే వారు apss&kgbv@apschooledu.in మెయిల్కు అభ్యర్థి సంతకం, వివరాలతో లెటర్ పంపిస్తే దరఖాస్తును రద్దు చేసి మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి మానిటరింగ్ సెల్కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 94412 70099 నంబర్లో సంప్రదించాలని సూచించారు.