Skip to main content

Admissions in PG courses: ఢిల్లీ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2022

Delhi University Entrance Test

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్శిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన ఢిల్లీ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(డీయూఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు: ఎంఏ, ఎంకాం, బీఈడీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ తదితరాలు.
సబ్జెక్టులు: అరబిక్, బుద్ధిస్ట్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్, సైకాలజీ, కామర్స్, ఎలక్ట్రానిక్స్‌ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ప్లాంట్‌ మాలిక్యులార్, బయాలజీ, ఆంత్రోపాలజీ, హోమ్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: కోర్సులను అనుసరించి మెరిట్‌ అండ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.05.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.admission.uod.ac.in/

చదవండి: ​​​​​​​ TS EDCET 2022 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..

Last Date

Photo Stories