Skip to main content

జేఎన్‌టీయూహెచ్‌లో ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌

2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌టీ యూ హైదరాబాద్, బ్యాంకాక్‌ (థాయిలాండ్‌)లోని ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంయుక్తంగా 5సంవత్సరాల బీటెక్‌/ఎంఈ ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ (ఐఐడీడీఎంపీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌/ సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్స్‌ 2020/టీఎస్‌ ఎంసెట్‌ 2020 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 50 శాతం సీట్లు జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్‌ అభ్యర్థులకు, 50 శాతం సీట్లు టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంక్‌ అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 18, 2020.(సాయంత్రం 4 గంటల వరకు)
రూ.1000తో ఆలస్య రుసుము చివరి తేది: డిసెంబర్‌ 22, 2020 (సాయంత్రం 4 గంటల వరకు)
అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ తేది: డిసెంబర్‌ 23, 2020 (ఉదయం 10.30కు)

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.jntuh.ac.in 

Photo Stories