Skip to main content

నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా కోర్సు

భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పూర్‌లోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ) ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
కోర్సు:
ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు
మొత్తం సీట్ల సంఖ్య : 60
అర్హతలు:
బీఈ/బీటెక్‌ లేదా ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ ఇంజనీరింగ్‌ పాసయ్యుండాలి.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలన్నీ నింపి ‘ఎన్‌పీటీఐ, నాగ్‌పూర్‌’ పేరుమీదుగా రూ.500ల డీడీని తీసుకొని ప్రిన్సిపల్‌ డైరెక్టర్, ఎన్‌పీటీఐ, నాగ్‌పూర్‌ అడ్రస్‌కు పోస్ట్‌ ద్వారా పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.nptinagpur.com,  www.npti.gov.in

Tags

Photo Stories