Mini Job Mela: నిరుద్యోగులకు జాబ్ మేళా
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, ఏపీ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్వెల్, ఏపీఎస్ఎస్డీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని ప్రభుత్వ డీల్టిసి/ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనా అధికారి తెలిపారు. యంగ్ ఇండియా కంపెనీలో మార్కెటింగ్ మేనేజ్మెంట్లో 40 ఖాళీలకు ఎంపిక చేస్తున్నామన్నారు.
Job Mela: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
అభ్యర్థి వయస్సు 18–28, పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ చదవాలని, ఎంపికైన వారికి ట్రైనింగ్లో రూ.10వేలు, ఆ తర్వాత రూ.25 వేల వరకూ ఇస్తారన్నారు. మాక్స్ సెక్యూరిటీలో 80 ఉద్యోగాలకు ఎంపికలు ఉన్నాయన్నారు. సెక్యూరిటీ, డ్రైవర్ల ఉద్యోగాలకు పురుష అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎల్ఐసీలో 100 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 88868 82032 నంబర్ కు సంప్రదించాలన్నారు.