Employment Offer: మైలవరంలో ఉపాధి అవకాశం
Sakshi Education
యువతకు మైలవరంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇందుకోసం అర్హత, ఆసక్తి కలిగి ఉన్న వారు క్రింది వివరాలను పరిశీలించి, ప్రకటించిన తేదీకి ఇంటర్వ్యూలో హాజరు కావాలన్నారు.
సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా జరుగుతుందని పేర్కొన్నారు.
Job Mela: ఉద్యోగ అవకాశం... అర్హులందరూ దీనిని వినియోగించండి
టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జాబ్మేళాలో 20 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వారు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని కలెక్టర్ వివరించారు. పూర్తి వివరాలకు 95027 57755/ 97000 92606/ 96033 68324 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
Published date : 20 Sep 2023 03:24PM