Skip to main content

India Signs Trade Agreement With EFTA: భారత్, ఈఎఫ్‌టీఏ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌, యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ద్వారా భారతదేశానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి.
EFTA and India sign Trade and Economic Partnership Agreement

ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.

  • 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: ఈ ఒప్పందం వల్ల వచ్చే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా. దీని ద్వారా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయి.
  • సుంకాల తొలగింపు: ఈ ఒప్పందం ప్రకారం చాలా భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్‌టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు.
  • వ్యవసాయ ఉత్పత్తులపై మినహాయింపులు: పలు ప్రాసెస్డ్‌ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి.
  • సర్వీసు రంగంలో ప్రయోజనాలు: ఈ ఒప్పందం ద్వారా ఇరు పక్షాల సర్వీసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి.
  • చౌకైన వస్తువులు: స్విస్‌ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్‌లో కొంత చౌకగా లభించగలవు.
  • చట్టబద్ధత: లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి.
  • అమలు: ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది.
  • ఈఎఫ్‌టీఏ దేశాలు: ఈఎఫ్‌టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్‌స్టెయిన్‌ దేశాలు ఉన్నాయి.
  • ద్వైపాక్షిక వాణిజ్యం: 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌–ఈఎఫ్‌టీఏ మధ్య 18.65 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది.

India-UAE Relations: బంధం బలపడుతోంది.. భారత్ - యూఏఈ సంబంధాలు ఇవే!!

Published date : 11 Mar 2024 03:07PM

Photo Stories