Skip to main content

KGBVల్లో టీచర్లను కొనసాగించాలి.. ఖాళీగా పీజీటీ పోస్టులు

విజయనగరం అర్బన్‌: కేజీబీవీల్లో గెస్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయలను కొనసాగిస్తూ తరువాత ఖాళీలను మాత్రమే కొత్తవారికి ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ ఉమ్మడి విజయనగరం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

ఈ మేరకు స్థానిక ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యాయలంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ పేర్కొంది. కేజీబీల ప్రారంభం నుంచి పనిచేస్తున్న గెస్ట్‌ పీజీటీలకు, బోధనేతర సిబ్బందికి కనీస గౌరవేతనంతో పనిచేస్తూ..10వ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించిన అనుభవం ఉందన్నారు. నాలుగేళ్ల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కేజీవీబీల్లో ఇంటర్‌మీడియట్‌ తరగతులకు బోధిస్తున్న పలువురు పీజీటీలను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పలు పీజీటీ పోస్టులను వారితోనే భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ ఉమ్మడి విజయనగరం జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, కార్యదర్శి కె.శ్రీనివాసన్‌ పాల్గొన్నారు.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

ఏపీటీఎఫ్‌ ఉమ్మడి జిల్లా కమిటీ డిమాండ్‌

Published date : 03 Aug 2023 08:16PM

Photo Stories