సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఆధ్వర్వంలో నేర్పించే స్వయం ఉపాధి కోర్సులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని డీజీఎం పర్సనల్ కోడూరు శ్రీనివాసరావు సూచించారు.
అభ్యర్థులను ఎంపిక చేయాలి
సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 2న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగులకు టైలరింగ్, మగ్గం, బ్యుటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులకు అభ్యర్థులన ఎంపిక చేయాలని సూచించారు.