National Children's Science Congress: జిల్లా విద్యార్థినులకు ప్రతిభా పురస్కారం
Sakshi Education
కర్నూలు సిటీ: ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (2022)కార్యక్రమంలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
పెద్దహరివణం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని రెహానాకు సర్టిఫికెట్ అందజేస్తున్న మంత్రి
ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వర్టికల్ కర్వ్ బ్లేడ్స్ అనే అంశంపై చేసిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ంది. ఆదోని మండలం పెద్దహరివాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ ఎస్.చిరంజీవి పర్యవేక్షణలో విద్యార్థినులు రెహానా, మేఘన ఈ ప్రాజెక్టును ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఆర్థిక మంత్రి బుగ్గన, జిల్లా కలెక్టర్ సృజన సదరు విద్యార్థినులను అభినందించి అవార్డు అందజేశారు.