Skip to main content

School Education Department: మోగిన బడి గంట.. తొలిరోజు ఇంత‌ శాతం హాజరు నమోదు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న‌ పాఠ­శాలలు తెరుచుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా జూన్‌ 17 వరకు ఉ.7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
Schools reopen
మోగిన బడి గంట.. తొలిరోజు ఇంత‌ శాతం హాజరు నమోదు

ఈ నేపథ్యంలో.. అన్ని పాఠశాలల్లోను అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకు­న్నారు. మరోవైపు.. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదు­వుతున్న దాదాపు 43 లక్ష మంది విద్యా­ర్థుల కోసం ప్రభుత్వం సిద్ధంచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం అన్ని పాఠశా­లల్లోను ప్రారంభించారు.

చదవండి: 10th Advanced Supplementary: పరీక్ష తేదీలు ఇవే..

అలాగే, గతంలో పాఠశా­లలు తెరిచిన తొలిరోజు 30 శాతం దాటని హాజరు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 57 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో 61 శాతం మందికి విద్యా కానుక కిట్లను అందించారు. రెండోరోజు మంగళవారం నుం­చి కిట్ల పంపిణీని వేగవంతం చేసి వారం రోజు­ల్లో మొత్తం పంపిణీని పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక అన్ని పాఠశాలల్లోను ఉ.8.30–­9.00గంటల మధ్య విద్యార్థులకు రాగిజావ.. 11.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. 
 

Published date : 13 Jun 2023 05:26PM

Photo Stories