Skip to main content

టాప్‌ 50 వర్సిటీల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన

సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్ధులకు మరింత మెరుగ్గా ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించేందుకు వీలుగా గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మార్చి 1న ఉత్తర్వులు జారీ చేశారు.
Jagananna Videsi Vidyadeevena Scheme
టాప్‌ 50 వర్సిటీల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన

2023 –24 నుంచి టాప్‌ 50 ర్యాంక్‌ల్లో నిలిచిన ఉన్నత విద్యాసంస్ధల్లో 21 సబ్జెక్టులకు విదేశీ విద్యా దీవెన వర్తిస్తుంది. జ్ఞానభూమి పోర్టల్‌లో టాప్‌ 50 ర్యాంకులు సాధించిన వాటి జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితాలోని టాప్‌ 50 సంస్థల్లో 21 సబ్జెక్టుల్లో అడ్మిషన్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నూరు శాతం లేదా రూ.1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌ చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: Jagananna Videshi Vidya Deevena : జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా .. రూ.కోటి వరకు 100% ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌..

ఇతర విద్యార్థులకు నూరు శాతం లేదా రూ.కోటి వరకు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్‌ 50 ర్యాంకులు పొందిన విదేశాల్లోని ఉన్నత విద్యా సంస్థల జాబితాను జ్ఞానభూమి పోర్టల్‌లో ఏటా ప్రకటిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రయోజనం పొందిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు లబ్ధి కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. 

చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..

Published date : 02 Mar 2023 03:42PM

Photo Stories