దేశంలోనే తొలి ఆరోగ్య వర్సిటీగా గుర్తింపు పొందిన Dr. NTR University of Health Sciences - [NTRUHS] 24, 25వ స్నాతకోత్సవాలు జూలై రెండో వారంలో నిర్వహించనున్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో తేదీని ఖరారు చేయనున్నారు. కరోనా కారణంగా మూడేళ్లుగా వర్సిటీ స్నాతకోత్సవాలు నిర్వహించలేదు. దీంతో 2022 జనవరిలో 22, 23వ స్నాతకోత్సవాలు నిర్వహించారు. ఇంకా రెండు స్నాతకోత్సవాలు పెండింగ్లో ఉండటంతో జూలైలో నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవాల్లో పీహెచ్డీలు, సూపర్స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ప్రసాద్ తెలిపారు.