Skip to main content

పీఎం యువ మెంటార్‌షిప్‌కు ఏయూ విద్యార్థి

ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి యువ మెంటార్‌షిప్‌ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధక విద్యార్థి దేవరకొండ ప్రవీణ్‌కుమార్‌ ఎంపికయ్యారు.
praveen kumar
ప్రవీణ్‌కుమార్‌ను అభినందిస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల నుంచి 16 వేల మంది దీనికి పోటీ పడగా.. 75 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రవీణ్‌కుమార్‌ ఒక్కరే దీనిలో స్థానం పొందారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి అభినందించారు. ప్రధాన మంత్రి యువ మెంటార్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని.. ప్రాచుర్యంలోకి రాని పలువురు స్వాతంత్య్ర యోధుల జీవిత గాథలను పుస్తక రూపంలో తీసుకొస్తారు. దీనిని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రిస్తుంది. దీనికి సంబంధించిన పరిశోధన, సమాచార సంగ్రహణ చేసేందుకు ఆరు నెలల పాటు నెలకు రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది.

చదవండి: 

282 Jobs: భర్తీకి నోటిఫికేషన్

Vaccination: జిల్లాల‌ వారీగా టీకా తీసుకున్న వారు సంఖ్య.. 

High Court: ఆ విద్యార్థులకు 25 శాతం సీట్లివ్వండి

Published date : 04 Jan 2022 04:02PM

Photo Stories