Skip to main content

ఏయూలో అభివృద్ధిని సీఎంకు వివరిస్తా..

ఏయూక్యాంపస్‌: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విచ్చేశారు.

వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఏయూ పరిపాలన భవనంలో ఏయూలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన ప్రాజెక్టుల ప్రగతిని మంత్రికి వివరించారు. ఇక్కడ జరుగుతున్న ప్రగతిని ముఖ్యమంత్రికి వివరిస్తానని మంత్రి తెలిపారు. ఏయూలో ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వర్సిటీ తరఫున మంత్రిని వీసీ సత్కరించారు.

నగరంలో నేడు

● ఉదయం 10 గంటలకు నోవాటెల్‌లో ఓటర్ల నమోదుపై రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం

● ఉదయం 10.45 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి మెయిన్‌ గెట్‌ వరకు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

● మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడిగా కోలా గురువులు ప్రమాణస్వీకారం

● సాయంత్రం 6 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మణిపూర్‌ ఘటనపై కొవ్వొత్తుల ప్రదర్శన

మంత్రి బొత్స సత్యనారాయణ

Published date : 02 Aug 2023 04:33PM

Photo Stories