Skip to main content

Vaccination: జిల్లాల‌ వారీగా టీకా తీసుకున్న వారు సంఖ్య.. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 15–18 ఏళ్ల వారి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జ‌న‌వ‌రి 3న‌ విశేష స్పందన లభించింది.
Vaccination
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినులకు వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్య సిబ్బంది

ఉదయం పది గంటల నుంచి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించగా అది రాత్రి వరకు కొనసాగింది. తొలిరోజు రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్లలో 4,92,613 మందికి కోవాగ్జిన్ టీకా వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి చేశారు. కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బంది పాఠశాలలకు వెళ్లి వేశారు. కోవిన్ యాప్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకున్న వారికి నేరుగా టీకా ఇవ్వగా.. మిగిలిన వారికి ఆధార్‌ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డులోని వివరాలు నమోదు చేసి టీకా వేశారు. ఇక 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. 25 లక్షల మంది యువత లక్ష్యం కాగా 40 లక్షల కోవాగ్జిన్ డోసులను సిద్ధంగా ఉంచారు.

టీకా తీసుకున్న వారు..

జిల్లా

సంఖ్య

చిత్తూరు

72,719

శ్రీకాకుళం

38,644

నెల్లూరు

39,759

కృష్ణా

51,778

పశ్చిమ గోదావరి

39,193

విజయనగరం

23,573

తూర్పు గోదావరి

46,210

వైఎస్సార్‌ కడప

28,897

అనంతపురం

35,364

కర్నూలు

38,942

ప్రకాశం

25,036

గుంటూరు

29,004

విశాఖపట్నం

23,494

చదవండి:

New Rules: ఇక‌పై జాబ్ కావాలంటే.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!

Covid-19 Vaccination: కరోనా టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?

Covid-19 Vaccination: ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?

Published date : 04 Jan 2022 12:36PM

Photo Stories