Skip to main content

ANGRAU: ఎంఎస్సీ కోర్సులకు రెండవ విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు 2022–23 సంవత్సరానికి గానూ ఎంఎస్సీ కోర్సులు(అగ్రి, ఎంఎస్సీ), సామాజిక శాస్త్రం ఎంబీఏ (ఏబీఎం)ల్లో ప్రవేశాలకు మార్చి 7వ తేదీన రెండవ విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ డాక్టర్‌ జి.రామారావు మార్చి 3న ఒక ప్రకటనలో తెలిపారు.
ANGRAU
ఎంఎస్సీ కోర్సులకు రెండవ విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

గుంటూరు నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన కేంద్రం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని కోరారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌  డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి:

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి

ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 04 Mar 2023 03:49PM

Photo Stories