Skip to main content

ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎమ్మెస్సీ(అగ్రి), ఎంటెక్, ఎమ్మెస్సీ(సామాజికశాస్త్రం), ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామారావు జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
Acharya NG Ranga Agricultural University invites applications for various courses
ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసక్తిగల విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన దరఖాస్తులో జనవరి 11వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా తమ వివరాలు నమోదు చేసి, ఆ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆ అప్లికేషన్‌కు సంబంధిత అర్హత పత్రాలను జతపరిచి జనవరి 17వ తేదీలోపు విశ్వవిద్యాలయంలో అందజేయాలని తెలిపారు. పోస్టు ద్వారా అయితే రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం, గుంటూరు–522034 అనే చిరునామాకు పంపాలని సూచించారు.

చదవండి: 

విద్యార్థులు 2 నెలల పాటు సామాజిక సేవ చేయాల్సిందే..

ANGRAU: ‘ఈ–రిసోర్సెస్‌’లో ఎన్జీరంగా వర్సిటీకి స్కోచ్‌ అవార్డు

Published date : 06 Jan 2023 03:49PM

Photo Stories