ఓయూలో ప్రొఫెసర్ జి.రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (జీఆర్సీడీఈ)లో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
ఓయూలో దూరవిద్య ప్రవేశాలు
డిసెంబరు 15 వరకు ప్రవేశాలు పొందవచ్చని డైరెక్టర్ ప్రొ.జీబీ రెడ్డి నవంబర్ 21న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు తీసుకోవచ్చన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు ఓయూ దూరవిద్యా కోర్సులు చేయవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.