సుదీర్ఘ కాలం తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సుల ఫీజులు పెంచుతూ వర్సిటీ అధికారులు సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకున్నారు.
OU: ఓయూ దూరవిద్య కోర్సుల ఫీజు పెంపు
దీంతో గతంలో ఉన్న ఫీజులకు అదనంగా రూ.1000 నుంచి రూ.2000 వరకు పెరిగాయి. బీఏ కోర్సుకు రూ.4,000, బీబీఏ రూ.8,000, బీకాం రూ.5,000, ఎంఏ కోర్సులకు రూ.6,000, ఎంకాం, ఎమ్మెస్సీలకు రూ.6,500, ఎంబీఏ రూ.40,000 (రెండేళ్లు), ఎంసీఏ రూ.30,000 (రెండేళ్లకు), పీజీ డిప్లొమాలకు రూ.6,000, పీజీడీసీఏ రూ.8,000, బయోఇన్ఫర్మేషన్ (రెగ్యులర్ కోర్సు) డిప్లొమాకు రూ.30,000కు ఫీజును పెంచారు. అదనపు ఫీజులు ఈ విద్యా సంవత్సరం (2021–22) నుంచి అమలు కానున్నాయి.