Admissions: ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
పర్వతగిరి: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్, వరంగల్ సమన్వయ అధికారి డీఎస్.వెంకన్న, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ డి.మాధవీలత జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
![Invitation of applications for admissions in Class V](/sites/default/files/images/2024/01/06/scholarship1-1704533027.jpg)
దరఖాస్తు ప్రక్రియ జనవరి 6న ముగియనుందని పేర్కొన్నారు. నాలుగో తరగతి చదువుతూ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు www.tswreis.telangana.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి: Admissions: ఈ పాఠశాలల్లో ప్రవేశాలకి దరఖాస్తు గడువు తేదీ ఇదే..
ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 06 Jan 2024 02:53PM