కామారెడ్డి టౌన్: ఎటువంటి పరీక్షలు లేకుండా క్రమబద్ధీకరణ చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.
పరీక్షలు లేకుండా క్రమబద్ధీకరించాలి
ఆగస్టు 9న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విధాలా సేవలందిస్తున్నామన్నారు.
తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తూ తమను రెగ్యూలర్ చేయకుండా పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తానన్న సీఎం తక్షణమే తమను రెగ్యూలర్ చేసి మిగతా పోస్టులకు పరీక్ష నిర్వహించాలని కోరారు.