జనగామ రూరల్: జిల్లా కేంద్రం శామీర్పేటలోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకులుగా పని చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.హరిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు.
అతిథి అధ్యాపకులకు అవకాశం
బోటనీ, మైక్రోబయలాజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని, జనరల్ అభ్యర్థులకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. సెట్, నెట్, పీహెచ్డీ చేసి బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, అక్టోబర్ 3వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవలని సూచించారు. మరిన్ని వివరాలకు 99496 98695, 88975 38351 నంబర్లలో సంప్రదించాలన్నారు.