బాపట్ల అర్బన్: వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్లను మళ్లీ చదువుకునే అవకాశం ఉందని విద్యా శాఖాధికారులు తెలిపారు.
చదువు మానేసిన వారికి సువర్ణ అవకాశం
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్స్లో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఆదేశాల మేరకు ఆగస్టు 2న ఏబీఎం హైస్కూల్లో ఏ1 కో–ఆర్డినేటర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అపోస్ జిల్లా కో–ఆర్డినేటర్ బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా చదువు మధ్యలో ఆపేసిన వారికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంఈఓలు నిరంజన్, ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత కో–ఆర్డినేటర్స్ ర్యాలీ నిర్వహించారు.