Skip to main content

TSPSC Paper Leak: ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రికి.. పేప‌ర్‌ను విక్ర‌యించుకుంటూ పోయిన నిందితులు?

తెలంగాణలో నిరుద్యోగుల్ని కుదిపేసి.. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన పేపర్ల లీక్‌ వ్యవహారంలో వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు పేపర్లు అమ్ముకున్నారు. విచార‌ణ‌లో ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తాజాగా.. ఈ కేసులో మరొకరిని అరెస్ట్‌ చేసింది సిట్‌. మహబూబ్‌నగర్ గండీడ్‌కు చెందిన తిరుపతయ్య అనే అభ్యర్థిని సిట్‌ అరెస్ట్‌ చేసింది.
TSPSC Paper leak
TSPSC Paper leak

15కు చేరిన అరెస్టుల సంఖ్య‌
పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టుల సంఖ్య 15కి చేరింది. మొదట ఈ కేసులో ఒకేసారి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తొమ్మిది మంది సిట్‌ విచారణలో ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆపై మరో ఇద్దరినీ, తాజాగా తిరుపతయ్యను అరెస్ట్‌ చేసింది సిట్‌. డాక్యా నాయక్‌ నుంచి తిరపతయ్య ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. 

చ‌ద‌వండి: రద్దైన ప‌రీక్ష‌ల రీషెడ్యూలు ఇలా.. మే నెల‌లో..!
100 మార్కులు వ‌చ్చిన వారంద‌రినీ...
ఇదిలా ఉంటే.. సిట్‌ ఇవాళ నిందితులను సిట్‌ మళ్లీ కస్టడీలోకి తీసుకోనుంది. దీంతో మరిన్నిపేర్లు బయటపడొచ్చని, అరెస్టులు జరగొచ్చని అర్థమవుతోంది. గ్రూప్ -1(Group 1) ప్రిలిమ్స్‌లో(రద్దైంది) 100కుపైగా మార్కులు వచ్చినవాళ్లను సిట్‌ పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. వాళ్లకు 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరుతోందని తెలుస్తోంది.

Published date : 21 Apr 2023 01:47PM

Photo Stories