Skip to main content

TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరిన్ని అరెస్టులు ఇవే..? ఇప్ప‌టి వ‌ర‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలుత 9 మందిని అరెస్ట్‌ చేయగా.. వాళ్ల విచారణ ద్వారా రాబట్టిన సమాచారంతో తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసింది.
TSPSC Paper Leak Case Telugu news
TSPSC Paper Leak Case Details

దీంతో  ఈ కేసులో నిందితుల సంఖ్య 12కి చేరింది. టీఎస్‌పీఎస్సీని క‌దిలిస్తే తేనెతుట్టె కదులుతుండడంతో.. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగొచ్చని తెలుస్తోంది. ఇక పన్నెండు మంది నిందితులను మార్చి 23వ తేదీన (గురువారం) సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు సిట్‌ అధికారులు. పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ అయిన తొమ్మిది మంది రిమాండ్‌ ఇవాళ్టితో ముగిసింది. దీంతో వాళ్లను కోర్టులో ప్రవేశపెట్టింది సిట్‌. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.

➤☛ TSPSC: ఇక అన్నీ సీబీ పరీక్షలే!

చంచల్‌ గూడా జైలుకు..

tspsc paper leak case news

తాజాగా అరెస్ట్‌ అయిన ముగ్గురికి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు(14 రోజుల) రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. వీళ్లందరికీ వైద్య పరీక్షల అనంతరం చంచల్‌ గూడా జైలుకు తరలించారు సిట్‌ అధికారులు. మరోవైపు టీఎస్‌పీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ప్రధాన నిందితులైన..

tspsc praveen kumar

సిట్ మార్చి 22వ తేదీన (బుధవారం) టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్‌ రూం అధికారిణి శంకర్‌ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్‌. ఈమె సిస్టమ్‌ నుంచే పేపర్లు లీక్‌ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో.. టీఎస్‌పీఎస్సీలో టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

➤☛ TSPSC Paper Leak Case : ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్‌–1 సహా ఇతర ప్రశ్నపత్రాలు.. ఇంకా న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో..

ఈ ఆధారాలే కీలకం..

ఇక.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్‌ స్నేహితుడైన సురేష్‌ నడుమ సంబంధాలపై సిట్‌ ఆరా తీస్తోంది.  సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం వీళ్లిద్దరి మధ్య వాట్సాప్‌ ఛాటింగ్‌, కాల్‌ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలను బట్టి..  రాజశేఖర్‌ టీఎస్‌పీఎస్సీ నుంచి పేపర్‌ తీసుకెళ్లి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించింది సిట్‌. అయితే సురేష్‌ సైతం పేపర్‌ను లీక్‌ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్‌ ఇచ్చాడు? అనే కోణంలో సిట్‌ దర్యాప్తు ఇప్పుడు ముందుకు సాగుతోంది. 

 

☛➤ KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..

రేణుక, నిలేష్, గోపాల్‌ల నడుమ..

tspsc renuka

మరోవైపు పేపర్‌ లీకేజ్‌ కేసులో.. నేడు సిట్‌ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్‌. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్‌లలోని ప్రశ్న పత్రాలు లీక్‌ కావడంపై నిందితులను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో.. పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్‌ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్‌జాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించింది. ఈ లావాదేవీలపై సిట్‌ కూపీ లాగుతోంది.  ఇక రాజశేఖర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, వాట్సాప్‌ ఛాటింగ్‌ వివరాల ఆధారంగానే సిట్ నిందితులపై ప్రశ్నలు గుప్పిస్తోంది.

➤☛ TSPSC Paper Leak Accused Renuka : పేప‌ర్ లీక్ కోసం.. గాలం వేసిందిలా.. చివ‌రికి తానే గాలానికి చిక్కుకుందిలా..

Published date : 23 Mar 2023 07:57PM

Photo Stories