Skip to main content

Telangana CM Revanth Reddy : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎం రేవంత్ చేసిన‌ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెల్సిందే.
Telangana CM Revanth Reddy

అభ్యర్థుల ఆందోళనలపై ఎట్ట‌కేల‌కు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. 

➤☛ TSPSC Group-1 Mains Exams 2024 Live Updates : ఇక గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు లైన్ క్లియ‌ర్‌...

గ్రూప్‌-1 రద్దు చేయాలని...

అక్టోబర్‌19వ తేదీన (శనివారం) సాయంత్రం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పోలీస్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చినపుడే జీవో నెంబర్‌ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్‌-1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్‌-1 ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. గ్రూప్‌-1 రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్‌-1 అభ్యర్థులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Published date : 19 Oct 2024 08:29PM

Photo Stories