Skip to main content

AP News: రెండు నెలల్లో వైజాగ్‌ రాజధాని... టార్గెట్‌ ఐటీ హబ్‌

ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నం గురించి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మరోసారి ఉద్ఘాటించారు.

విశాఖలో శనివారం రెండో రోజు ఇన్ఫినిటి వైజాగ్‌ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్‌ చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్‌తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: మీరు సూపర్‌గా వంట చేస్తారా... జీతం 4.5 లక్షలు ఇస్తారు..

చ‌ద‌వండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ...

చ‌ద‌వండి: రేపే కానిస్టేబుల్ ఎగ్జామ్‌.. నిమిషం ఆల‌స్య‌మైనా ఇంట్లో కూర్చోవాల్సిందే 

Published date : 21 Jan 2023 07:00PM

Photo Stories