Skip to main content

M. Tech Results: ఎంటెక్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

వర్సిటీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
Principal Professor SV Satyanarayana releasing the results

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల ఎంటెక్‌ ఒకటో సెమిస్టర్‌ (ఆర్‌–21) రెగ్యులర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 12న ప్రారంభమైన సెమిస్టర్‌ 14వ తేదీన ముగిసింది. ఈ క్రమంలో కేవలం 13 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

Intermediate Exams 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఇందుకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ డి. విష్ణువర్ధన్‌, డాక్టర్‌ డి. లలిత కుమారిని ప్రిన్సిపాల్‌ అభినందించారు. విద్యార్థులు మార్కులు తెలుసుకునేందుకు కళాశాల అకడమిక్‌ సెక్షన్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఈ. అరుణ కాంతి, పాలక మండలి సభ్యులు డాక్టర్‌ ఎం. రామశేఖర్‌ రెడ్డి, విభాగాధిపతులు డాక్టర్‌ జి.మమత, అజిత ప్రొఫెసర్‌ ఆర్‌.భువన విజయ, డాక్టర్‌ ఓం ప్రకాష్‌, డాక్టర్‌ దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Corporate Education: పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత ప్రవేశాల అవకాశం..!

Published date : 28 Feb 2024 04:08PM

Photo Stories