Skip to main content

ఎన్‌ఎస్పీలో నమోదు చేసుకోవాలి

నేషనల్‌ మీన్స్‌–కమ్‌–మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (మార్చి 2022) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు.
Register in NSP
ఎన్‌ఎస్పీలో నమోదు చేసుకోవాలి

విద్యార్థులు సెప్టెంబర్‌ 30లోగా నమోదు చేస్తే పాఠశాల స్థాయిలో ధ్రువీకరణకు చివరి తేదీ 16 అని చెప్పారు. లేనిపక్షంలో వారికి ఇక ఎప్పటికీ స్కాలర్‌షిప్‌ మంజూరు కాదన్నారు. 2021 ఫిబ్రవరి, 2019 నవంబర్, 2018 నవంబర్‌లలో ఎంపికై ప్రభుత్వ పాఠశాలలో/కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. లేకుంటే స్కాల్‌షిప్‌ మంజూరు కాదన్నారు. ఎంపికైన ప్రతీ విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకొని స్కాలర్‌షిప్‌ పొందాలన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.

చదవండి: 

Published date : 21 Jul 2022 01:22PM

Photo Stories