Skip to main content

PM CARES Fund: పీఎం–కేర్స్‌ నిధి నుంచి రూ.10లక్షలు

PM CARES Fund: పీఎం–కేర్స్‌ నిధి నుంచి ఎంత మొత్తాన్ని సాయంగా అందించనున్నారు?
PM Cares Fund: Govt announces Rs 10-lakh support for Covid-orphans
PM Cares Fund: Govt announces Rs 10-lakh support for Covid-orphans

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 23ఏళ్లు వచ్చేసరికి పీఎం–కేర్స్‌ నిధి నుంచి రూ.10లక్షల మొత్తం సాయంగా అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం–కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇనీషియేటీవ్‌ పథకాన్ని మే 29, 2021న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు పాఠశాలల్లో చదువుకొనే సమయంలో రూ.20,000 స్కాలర్‌షిప్, ప్రతినెలా రూ.4,000 ఖర్చుల నిమిత్తం అందించనున్నారు. ఈ పథకం కింద పిల్లలు ఉన్నత విద్యాభ్యాసానికి రుణాలు తీసుకొనేందుకు కూడా అర్హులు. దీంతోపాటు ఈ చిన్నారులకు రూ.5లక్షల విలువైన హెల్త్‌కవరేజీ లభించేలా ఆయుష్మాన్‌ కార్డులను కూడా అందజేయనున్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28లోపు కరోనా కారణంగా తల్లిదండులు ఇద్దర్నీ లేదా ఒకరిని, చట్టపరమైన సంరక్షకులను, దత్తత తీసుకొన్న పేరెంట్స్‌ను కోల్పోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. 

PMJJBY: పీఎం జీవన్‌ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు

Published date : 07 Jun 2022 05:19PM

Photo Stories