Skip to main content

నర్సరీ ఏర్పాటుకు సర్టిఫికెట్‌ కోర్సు.. అర్హుత‌లు ఇవే..

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో తొలిసారిగా సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభించనున్నారు.
నర్సరీ ఏర్పాటుకు సర్టిఫికెట్‌ కోర్సు..
నర్సరీ ఏర్పాటుకు సర్టిఫికెట్‌ కోర్సు..

ఎంటర్‌ప్రెన్యూర్‌íÙప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా నిరుద్యోగులకు నర్సరీ ఏర్పాటుకుపై శిక్షణ ఇవ్వనున్నారు. నర్సరీల పెంపకం వరీ్మకంపోస్టు తయారీ, తేనెటీగల పెంపకంపై ఆరునెలల పాటు శిక్షణ ఇస్తారు. మూడు నెలలు తరగతులు, మరో మూడు నెలలు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది. శిక్షణాకాలంలో ప్రతినెలా రూ.10వేల స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. నర్సరీని ఏర్పాటు చేసేందుకు ఫెలోషిప్‌ కింద రూ.50వేలు అందిస్తారు. పదో తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 22వ తేదీలోగా ఠీఠీఠీ.జఛిటజ్టీట.జీnలో లేదా నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ మమత తెలిపారు. మరిన్ని వివరాలకు 9885226957, 8074350866 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

రాష్ట్రంలోని ఏ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది?

వ్యవసాయ విద్యా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?

Published date : 17 Mar 2022 05:05PM

Photo Stories