ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో దూరవిద్య కోర్సులకు ఇక నుంచి సెమిస్టర్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు డైరెక్టర్ ప్రొ. జీబీ రెడ్డి తెలిపారు.
దూరవిద్య కోర్సులకు సెమిస్టర్ పరీక్షలు
ఇప్పటికే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సెమిస్టర్ అమలులో ఉండగా యూజీసీ నిబంధనల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పీజీ కోర్సుల పరీక్షలు సెమిస్టర్ పద్ధతిలో కొనసాగనున్నాయని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులకు కూడా వచ్చే ఏడాది నుంచి సెమిస్టర్ పరీక్షల పద్దతిని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు 15 రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.